టీ (చాయ) ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే రోజూ మన నిత్య జీవిత కార్యక్రమాలు ప్రారంభమైంది మొదలు పూర్తయ్యే వరకూ నాలుగైదు సార్లైనా టీ తాగుతాము. ఎంత పని ఒత్తిడిలో ఉన్న టీం తాగడంతో కొంత ఉపశమనం కలుగుతుంది. అందుకే దేశంలోని 75 శాతం మంది టీ తాగుతున్నారు. మరీ అంతలా డిమాండ్ ఉన్న టీ తయారీకి వాడే టీ పొడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అయితే, తాజాగా టీ పొడి వేలంపాటలో కిలో ధర ఎంతో తెలిస్తే మీరు షాక్ గురవ్వాల్సిందే. ఇంత ధర ఎందుకు? ఏముంది అందులో? అనాల్సిందే ! ఇంతలా చెబుతున్న ఆ టీపొడి ధర ఎంత అనుకుంటున్నారా? ఒక్క కిలో టీ పొడి ధర రూ. 75 వేలు ! నిజమే.. ఒక్క కిలో టీ పొడి ధర అక్షరాల డెబ్బై ఐదు వేలు. అది అంత ప్రత్యేకం కాబట్టే ఆ ధర పలికింది మరి.
మన దేశంలో తేయాకు పంటకు ఈశాన్య భారతం పెట్టింది పేరు. అక్కడ అనేక రకాల.. అధిక నాణ్యత గల ప్రసిద్ధి చెందిన తేయాకు పంటలు ఉంటాయి. అసోంలోని గౌహతీ టీ ఆక్షన్ సెంటర్ (GTAC) ఇటీవల ప్రత్యేకమైన టీని వేలానికి పెట్టింది. దీన్ని కొనుగోలు చేసేందుకు పలు టీ సంస్థలు పోటీపడ్డాయి. దీంతో కిలో టీ రూ.75 వేలకు అమ్ముడుపోయింది. ఇంత ఖరీదు పెట్టిమరి కొన్నది కాంటేంప్రరీ బ్రోకర్స్ ప్రైవట్ లిమిటెడ్ సంస్థ. టీ పొడి వేలంపాటలో ఇప్పటివరకూ పలికిన అత్యధిక ధర ఇదే కావడం గమనార్హం.
అయితే, ఇంత భారీ ధరకు ఆ టీ పొడి అమ్ముడుపోవడంతో ఇది వైరల్ గా మారింది. రికార్డు స్థాయిలో ధర పలకడానికి ఆ టీ పొడిలో ఏం ప్రత్యేకతలు ఉన్నాయంటూ సర్వత్రా ప్రశ్నలు వస్తున్నాయి. దీని ప్రత్యేకత గురించి మనోహరి టీ ఎస్టేట్ డైరెక్టర్ రాజన్ మాట్లాడుతూ.. ఇది అత్యంత మెలిరకమైన టీ పొడి అనీ, చాలా ప్రత్యేకమైనదని అన్నారు. దీని ఉత్పత్తికోసం దిబ్రూగఢ్ లోని తమ ఎస్టేట్లో ఎంతో శ్రమించారని తెలిపారు. సూర్యకిరణాలు ప్రసరించడానికి ముందుగానే.. ఈ టీ బడ్స్ను సేకరిస్తారని తెలిపారు. గతేడాది దీని ధర రూ.50 పలికిందనీ, కరోనా సంక్షోభంలోనూ ఈ ఏడాది రికార్డు స్థాయిలో కిలో 75 వేల రూపాయల ధర పలికిందని వివరించారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?