బాహుబలి, సాహో చిత్రాలతో రెబెల్ స్టార్ ప్రభాస్ ఇండియా వైడ్ గా ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ప్రభాస్ నటిస్తోన్న ప్రస్తుత చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ఈరోజు విడుదల చేసారు. దీనికి టైటిల్ రాధే శ్యామ్ అని ప్రకటించారు నిర్మాతలు.
అలాగే ప్రభాస్, పూజ హెగ్డే దగ్గరగా ఉన్న పోస్టర్ ను ఫస్ట్ లుక్ గా వదిలారు. దీనిపై సర్వత్రా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. అయితే అస్సాం పోలీస్ మాత్రం దీనికి భిన్నంగా స్పందించారు. “మీకు కావాల్సిన వారు బయటకు వెళ్తున్నప్పుడు మాస్క్ పెట్టుకోమని చెప్పండి. మేము ప్రభాస్ కు కాల్ చేసి చెప్దామని ప్రయత్నించాం కానీ కుదర్లేదు. సో ఇలా ఫోటోషాప్ ద్వారా మెసేజ్ పంపుతున్నాము” అని ఫన్నీ ట్వీట్ చేసారు.