మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుపోతున్న విషయం తెలిసిందే. అయితే.. ఇది ఉద్యోగాల విషయంలోనే కాకుండా మద్యం తాగడంలో కూడా అంటూ ఓ సర్వే చెబుతోంది. అయితే ఈ మద్యం తాగడంలో అసోం రాష్ట్ర మహిళలు అందరి కంటే ముందు వరుసలో దూసుకుపోతున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వేలో ఈ విషయం బయటపడింది. 2019-20లో తీసుకున్న డేటా ప్రకారం దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాలతో పోలిస్తే.. 15 నుంచి 49 ఏళ్ల వయసున్న అసోం మహిళల్లో 26.3 శాతం మంది మద్యం తాగుతున్నారని ఈ సర్వే చెబుతోంది. మేఘాలయ రాష్ట్రంలో ఇది 8.7 శాతం ఉంది.
15 నుంచి 49 ఏళ్ల లోపు ఉండే మహిళలు దేశవ్యాప్తంగా మద్యం సేవిస్తున్నది 1.2 శాతం మాత్రమే.. 2015-16లో నిర్వహించిన ఎన్ఎఫ్హెచ్ఎస్ నివేదికలో ఈ గణాంకాలను తెలిపారు. అయితే 2018-19లో నిర్వహించిన ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే నివేదిక విడుదల కావాల్సి ఉంది. మరోవైపు 2005-06లో నిర్వహించిన ఎన్ఎఫ్హెచ్ఎస్ సర్వే ప్రకారం 15-49 ఏళ్ల వయసున్న అసోం మహిళల్లో మద్యం తాగేవారు 7.5%గా ఉంది.
2005-06 ఎన్ఎఫ్ హెచ్ ఎస్ సర్వేలో అసోం కన్నా ఐదు రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. అవి అరుణాచల్ ప్రదేశ్ (33.6శాతం), సిక్కిం (19.1శాతం), ఛత్తీస్గఢ్ (11.4శాతం), జార్ఖండ్ (9.9శాతం), త్రిపుర (9.6శాతం) ముందంజలో ఉన్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే-3 లో అసోంలో మద్యం సేవించే మహిళలు 7.5% ఉండగా సర్వే 4లో ఇది 26.3 శాతానికి పెరిగింది. మరోవైపు సర్వే-3లో టాప్లో ఉన్న అరుణాచల్ ప్రదేశ్ (3.3శాతం), సిక్కిం (0.3శాతం), ఛత్తీస్గఢ్ (0.2శాతం), జార్ఖండ్ (0.3శాతం), త్రిపుర (0.8శాతం)గా గణాంకాలు తగ్గిపోయాయి.
దేశవ్యాప్తంగా వారానికోసారి మద్యం తాగే మహిళలు 35 శాతం మంది ఉన్నారు. అదే ఒక్క అసోంలో 44.8 శాతం మంది ఉన్నారు. 15-49 ఏళ్ల వయసున్న మగవారు అసోంలో 35.6 శాతం మంది మద్యాన్ని తాగుతున్నారు. అరుణాచల్ ప్రదేశ్లో వీరి సంఖ్య 59 శాతంగా ఉంది. పొగా తాగడంలో కూడా దేశవ్యాప్తంగా చూసినప్పుడు అసోం మహిళలు 60 శాతంగా, పురుషులు 17.7శాతంగా ఉండి, టాప్లో నిలిచారు.