అంతరిక్షం.. ఎన్నో వింతలూ విశేషాలు ఉండే అంతుచిక్కని రహస్యం. గ్రహాలు, ఉల్కలు, నక్షత్రాలు, పాలపుంతలు.. ఇలా అంతరిక్షం గురించి ఎప్పుడూ ఏదొక వార్త వింటూనే ఉంటాం. ప్రస్తుతం అలాంటి వార్తే ఒకటి నాసా నుంచి వచ్చింది. అతి త్వరలోనే ఓ భారీ గ్రహ శకలం భూమికి అతి చేరువలోకి వచ్చి ఢీకొట్టబోతోందని అంటున్నారు. ఇదే జరిగితే భారీ నష్టం తప్పదని కూడా అంటున్నారు. వచ్చే సెప్టెంబర్ 1న ఉదయం 10:49 గంటలకు 2011 ES4 అనే గ్రహ శకలం భూమికి దగ్గరగా వెళ్తుందని వివరించింది.
గ్రహ శకలం భూమికి దగ్గరగా దాదాపు 44,618 మైళ్ల దూరం నుంచి వెళ్తుందని తెలిపింది నాసా. గతంలో చాలా గ్రహ శకలాలు భూమికి దగ్గరగా వెళ్లినా నష్టం కలగ లేదు.. ఈసారి భూమిపై పడే ఈ గ్రహ శకలం పెద్ద నష్టమే చేస్తుందని అంటున్నారు. ఇందుకు కారణం కూడా వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. భూమికి, చంద్రుడికి గురుత్వాకర్షణ శక్తి ఉంటుంది. 2011 ES4 శకలానికి భూమిని ఆకర్షించే గుణం ఉండటంతో అది సవ్యమైన దిశలోనే వెళ్తున్నా భూమి ఆకర్షించడంతో పెద్ద నష్టమే జరగొచ్చిని అంటున్నారు.
భూమికి దగ్గరగా వచ్చే గ్రహ శకలాలను నియర్ ఎర్త్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఇవి తమ మార్గంలోనే వెళ్తాయి. అయితే.. వీటి మార్గంలో ఏదైనా గ్రహం వస్తే గురుత్వాకర్షణ శక్తికి లోనవుతాయి. దీంతో తమ దిశను మార్చుకుంటాయి. ప్రస్తుతం 2011 ES4 ప్రయాణం ఇలానే సాగనుందని అంటున్నారు. ఈ గ్రహ శకలం అంగారక గురు గ్రహాల మధ్య ఉండే గ్రహ శకాలాలలో ఒకటై ఉంటుదని నాసా అంటోంది.