యంగ్ హీరో నిఖిల్ చాలా కాలం తర్వాత ‘అర్జున్ సురవరం’ సినిమాతో ఒక మంచి హిట్ అందుకున్నాడు. వరసగా తను నటించిన సినిమాలన్ని ఫ్లాప్ గా నిలుస్తుండటంతో ఇక ఈ యంగ్ హీరో కెరీర్ క్లోజ్ అన్న టాక్ వచ్చింది. అయితే కిరాక్ పార్టీ తో హిట్ కొట్టి ట్రాక్ లోకి రాగా, ‘అర్జున్ సురవరం’ సినిమా చేసి బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ ను అందుకొని తన సత్తా చాటాడు నిఖిల్.
దాంతో మళ్ళీ ఫాంలోకి వచ్చిన నిఖిల్ వరసగా సినిమాలను అంగీకరిస్తున్నాడు. అందులో ఒక సినిమా గతంలో వచ్చిన సూపర్ హిట్ సినిమా కార్తికేయ కి సీక్వెల్ కార్తికేయ 2. ఈ సినిమాకి చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ‘అనుపమ పరమేశ్వరన్’ నిఖిల్ కి జంటగా నటిస్తుంది. బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన ‘రాక్షసుడు’ తర్వాత మళ్ళీ అనుపమ పరమేశ్వరన్ నటిస్తుంది ‘కార్తికేయ 2’ మాత్రమే.
ప్రస్తుతం ఈ ఒక్క సినిమా మాత్రమే నటిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి మరో సినిమాలో ఛాన్స్ వచ్చిందని తాజా సమాచారం. ఆ సినిమా కూడా నిఖిల్ హీరోగా తెరకెక్కే సినిమా కావడం ఆసక్తికరం. దర్శకుడు సుకుమార్, అల్లు అరవింద్ కలిసి నిర్మిస్తున్న సినిమా ’18 పేజెస్’. ‘కుమారి 21ఎఫ్’ ఫేమ్ పల్నాటి సూర్య ప్రతాప్ ఈ సినిమాని తెరకెక్కిస్తుండగా నిఖిల్ మెమరీ లాస్ సమస్యతో బాధ పడే పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో నిఖిల్ కి జంటగా అనుపమ పరమేశ్వరన్ ని ఎంచుకున్నారట. మొత్తానికి అనుపమ పరమేశ్వరన్ కి యంగ్ హీరో నిఖిల్ తో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసే అవకాశం దక్కడం విశేషం. అంతేకాదు ఈ టాలెంటెడ్ హీరోయిన్ ని ఇన్నాళ్ళకు గుర్తించడం కూడా ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.