ఆంధ్రప్రదేశ్ లో తెలుగు దేశం పార్టీ కొత్త కమిటీలకు కసరత్తు దాదాపు పూర్తి కావొచ్చింది. టీడీపీ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ కసరత్తు జరుగుతోన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలో తెలుగు దేశం పార్టీ గళాన్ని బలంగా వినిపించగలిగే నాయకులను కమిటీలకు ఎంపిక చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు ఎంపిక ఖరారైనట్లు సమాచారం. ఈ కీలక బాధ్యతలు అచ్చెన్నాయుడుకు అప్పగించేందుకు పార్టీ సిద్ధమైంది. ఈ నెల 27న అచ్చెన్నాయుడు పేరుని అధికారికంగా ప్రకటించనున్నారు. ప్రస్తుతం టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కళా వెంకట్రావు ఉన్న విషయం తెల్సిందే. ఆయన స్థానంలో మరోసారి బీసీలకే అవకాశం దక్కనుంది. చంద్రబాబు ఎంపికైన కొత్త కమిటీలను ప్రకటించనున్నారు. కాగా ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన అచ్చెన్నాయుడు 70 రోజులు రిమాండ్ లో ఉండి ఈ మధ్యే బెయిల్ పై బయటకు వచ్చిన విషయం తెల్సిందే.