Atchan Naidu : ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు Atchan Naidu ని ఈరోజు ఉదయం ఏపీ పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. సొంత నియోజకవర్గం నిమ్మాడలో అచ్చెన్నాయుడు ని అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరు పరచగా కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడం జరిగింది. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టిడిపి పార్టీకి చెందిన కీలక నాయకులు అచ్చెన్నాయుడు అరెస్ట్ ను నిరసిస్తూ తీవ్రస్థాయిలో వైసీపీ ప్రభుత్వం పై విమర్శల వర్షం కురిపించారు. అలా అచ్చెన్నాయుడు అరెస్ట్ అయ్యి 12:00 అయిందో లేదో మరో టాప్ టీడీపీ లీడర్ పట్టాభి నీ పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఎప్పుడు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం అయ్యింది.
మేటర్ లోకి వెళ్తే ఈరోజు ఉదయం పట్టాభి పై కొంతమంది గుర్తు తెలియని దుండగులు దాడికి పాల్పడటం జరిగింది. ఈ ఘటనలో పట్టాభి కి గాయాలు కావడంతో చంద్రబాబు హుటాహుటిన ఆయనను పరామర్శించడం మాత్రమేకాక జగన్ని తీవ్రస్థాయిలో విమర్శలు చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉండగా ఏ వాహనం అయితే దాడిలో ధ్వంసం అయింది అదే వాహనంలో జగన్ నివాసం తాడేపల్లి కి వెళ్లాలని ధ్వంసమైన కారులో ప్రయత్నించగా పట్టాభి ని పోలీసులు అదుపులోకి తీసుకుని అడ్డుకున్నారు. ఈ క్రమంలో పట్టాభి తో పాటు మరికొంతమంది టీడీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఉదయం అచ్చెన్నాయుడు అరెస్ట్ సాయంత్రం గాయాలపాలైన పట్టాభి అరెస్టు కావడంతో టిడిపి పార్టీ నాయకులు వైసీపీ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. పంచాయతీ ఎన్నికలలో ఓటమి భయంతో అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు అంటూ ఆరోపణలు చేస్తున్నారు.