Atchan Naidu : టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఇటీవల విశాఖపట్నం జిల్లాలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ క్రమంలో రెల్లి వీధి 33,35,37 వార్డుల్లో పార్టీ తరఫున ప్రచారం చేసిన ఆయన ..అధికార పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు వర్షం కురిపించారు. రాష్ట్రంలో రాక్షస మరియు దొంగల పాలన నడుస్తోంది అంటూ మండిపడ్డారు. పథకాలు పేరు చెప్పి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేస్తున్నారు అంటూ విమర్శల వర్షం కురిపించారు.
హుదూద్ సమయములో పార్టీ అధినేత చంద్రబాబు ఇక్కడే ఉండి సేవలందించారని, విశాఖ వాటిలో అది గుర్తు పెట్టుకోవాలి అంటూ పేర్కొన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక విశాఖలో ఎలాంటి అభివృద్ధి జరిగిందో చూపించండి అంటూ ప్రశ్నించారు. పన్నులు నిత్యావసర వస్తువులు అదేవిధంగా గ్యాస్ పెట్రోల్ రేట్లు పెంచేశారు, ధరలు పెంచేసి సామాన్యుడి నడ్డి విరుస్తున్నారు అంటూ ప్రభుత్వంపై మండిపడ్డారు. జైల్లో ఉన్న విజయసాయి రెడ్డి వైజాగ్ లో దందా చేస్తున్నాడు అంటూ ఆరోపించారు. అదేవిధంగా ప్రభుత్వ సలహాదారుడు.. సజ్జల రామకృష్ణారెడ్డి ఒక బ్రోకర్ లా పని చేస్తున్నాడని, పోలీసులను బెదిరించి రౌడీయిజం చేస్తున్నారు అంటూ అచ్చెన్నాయుడు వైసీపీ ప్రభుత్వ పెద్దలు విమర్శల వర్షం కురిపించారు. టిడిపి అధికారంలోకి వస్తే నీటి పనులు మాఫీ చేస్తామని, ప్రతి ఒక్కరికి ఉపాధి కల్పిస్తాము అంటూ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. ఇది ఏమైనా విశాఖపట్టణంలో గ్రేటర్ మేయర్ పీఠాన్ని టీడీపీకే దక్కాలని .. మంచి పట్టుదలతో ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతలు .. ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. అధికార పార్టీ పై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ మరో పక్క.. టీడీపీ గెలిస్తే ఏం చేస్తుందో వంటి విషయాల గురించి వైజాగ్ వాసులకు స్పష్టత ఇస్తూ ఉన్నారు.