ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బలపడాలని బీజేపీ పార్టీ ఎప్పటి నుండో టైమింగ్ కోసం ఎదురు చూస్తోంది. అయితే తాజాగా టీడీపీ పార్టీకి చెందిన నాయకులు వరుసగా అరెస్టులు కావటంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఫుల్ సెలబ్రేషన్ లో ఉన్నట్లు, అసలు ఏమాత్రం జోస్ తగ్గట్లేదు అన్నట్టు వార్తలు వైరల్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న టీడీపీ గతంలో అధికారంలో ఉన్న టైం లో చేసిన అవినీతి కార్యక్రమాలు అన్నిటినీ ఒక్కొక్కటిగా వైసీపీ ప్రభుత్వం బయట పెడుతోంది.
దీనిలో భాగంగా అచ్చం నాయుడు మరియు జెసి ప్రభాకర్ రెడ్డి వంటివారు అరెస్టులు కావటంతో త్వరలో టీడీపీ మొత్తానికి ఖాళీ అయ్యే పరిస్థితి ఉందని బీజేపీ భావిస్తున్నట్లు పరిశీలకుల మాట. దీనికి బలం చేకూరుస్తూ ఇటీవల మాజీ మంత్రి మాణిక్యాలరావు చేసిన వ్యాఖ్యలు కూడా గమనార్హం. మాజీ మంత్రి అచ్చం నాయుడు అరెస్టు వ్యవహారంలో మాణిక్యాలరావు ఓపెన్ గానే అచ్చెన్న అరెస్ట్ ను స్వాగతించడం జరిగింది. వరుసగా రెండు రోజుల నుండి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో టీడీపీ కీలక నేతలను అవినీతి వ్యవహారాలలో వైసీపీ ప్రభుత్వం అరెస్టులు చేస్తున్న తరుణంలో త్వరలో టీడీపీ ప్లేస్ రీప్లేస్ చేయటానికి బీజేపీ రెడీ అవుతున్నట్లు సమాచారం.