టీడీపీ సీనియర్ లీడర్, ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన అచ్చెన్నాయుడుకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. వరసగా సామాన్యులతో పాటు నేతల్లో కూడా కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటికే చాలా మంది ఎమ్మెల్యేలకు కరోనా సోకగా ఒకరిద్దరు మంత్రులకు కూడా ఈ మహమ్మారి సోకింది.
లేటెస్ట్ గా అచ్చెన్నాయుడు కూడా కరోనా బారిన పడ్డారు. ఈఎస్ఐ స్కామ్ లో అరెస్టైన ఆయన గుంటూరు రమేష్ ఆసుపత్రిలో అనారోగ్యం కారణంగా చికిత్స పొందుతున్నారు. గత రెండు రోజుల నుండి జలుబుతో బాధపడుతున్న అచ్చెన్నాయుడుకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్ అని తేలింది. అచ్చెన్నాయుడు ఆరోగ్య పరిస్థితిపై హైకోర్టుకు ప్రతివారం బులిటెన్ పంపుతున్న రమేష్ ఆసుపత్రి తాజాగా కరోనా పాజిటివ్ నేపథ్యంలో హైకోర్టుకు లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?