తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఈఎస్ఐ స్కామ్ లో తీవ్రమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు అతనిని అరెస్టు కూడా చేశారు. రాష్ట్రంలో పెద్ద సంచలనం సృష్టించిన ఈ అరెస్టుల నేపథ్యంలో అచ్చెన్నాయుడు హై కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేశాడు. ఇక ఈ రోజు దీనిపై హైకోర్టు విచారించగా ఇరు వాదనలు విన్న ప్రభుత్వం సోమవారానికి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇకపోతే ఆరోగ్య పరిస్థితి భాగోలేని అచ్చెన్నాయుడు ను గుంటూరు గవర్నమెంట్ ఆసుపత్రి లో ప్రభుత్వం తరపు న్యాయవాదులు ఎక్కువ రోజులు ఉంచగలిగారు. అక్కడే ఉండి అతనిని విచారించేందుకు హైకోర్టు కూడా అనుమతినిచ్చింది. తాజాగా అతని ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించిందని రిపోర్టులు వచ్చినప్పుడే హైకోర్టు అతనిని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించేందుకు అనుమతిని ఇచ్చింది. అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే కచ్చితంగా బెయిల్ పొందుతారని అంతా భావించారు. రేపో మాపో బెయిల్ ఖాయమని అంతా అనుకుంటున్న నేపథ్యంలో అతనికి వరుసగా షాక్ లు తగిలాయి.
ఈఎస్ఐ స్కాం విషయంలో ముందు చేసిన అరెస్టులు తప్ప…. తర్వాత ఏరకమైనా డెవలప్మెంట్ లేదు అని అందరూ అనుకుంటున్న నేపథ్యంలో తాజాగా టీడీపీ నేత పితాని సత్యనారాయణ పీఏ ను అరెస్టు చేయడం మరియు అతని కుమారుడు కి సెర్చ్ వారింట్ ఇవ్వడం అచ్చెన్నాయుడు కి పెద్ద దెబ్బ అని చెప్పాలి. అసలు పితాని కుమారుడు, పీఏ ‘ముందస్తు బెయిల్’ కు కోర్టు లో అప్లై చేశారు. వారిపై అనుమానం ఉన్న మాటను పక్కనపెడితే వారి ముందు జాగ్రత్త చర్యను చూసి ఏసీబీ నడుం బిగించింది. పితాని పీఏ అరెస్టుకి కావలసిన ఫార్మాలిటీలను త్వరగా పూర్తి చేసేసింది. ఆ ముందస్తు బెయిల్ వ్యవహారం లేకపోయి ఉంటే అచ్చెన్న కు ఈ పాటికి బెయిల్ వచ్చేసి ఉండేదట.
ఇక ఈ స్కాంలో తో అచ్చెన్నాయుడి తో పాటు వారి పాత్ర ఏమిటి అన్న విషయం పై సందేహాలు హైకోర్టుకి రావడంతో అతనిపై తాత్కాలికంగా నిలిపివేశారు అని టాక్. ఇప్పుడు ఇదే ఊపులో ఆధారాల సేకరణలో మరింర ఊపు ప్రదర్శించించి ప్రభుత్వం. ప్రభుత్వం తరపున జరిగి వాదనల్లో.. వారి న్యాయవాదులు ఈ కేసులో అచ్చెన్నాయుడు కీలక సూత్రధారి అని పేర్కొన్నారు. 2016 సెప్టెంబరు నుంచి అక్రమాలు చేసిన అనుభవంలేని పలు కంపెనీలకు అనుకూలంగా లేఖలు ఇచ్చినట్టు పేర్కొన్నారు. 2016లోనే మంత్రిగా అచ్చెన్నాయుడు ఇంట్లో జరిగిన సమావేశంలోని మినిట్స్ పరిశీలించాలని ప్రభుత్వం తరపు న్యాయవాది శ్రీరామ్ హైకోర్టుకు విన్నవించారు.
దీంతో సోమవారం జరిగే విచారణలో అచ్చెన్నాయుడుకు బెయిల్ వస్తుందా లేదా అనే అంశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.