Breaking: ఆగస్టు 20వ తారీకు తెలంగాణ స్టేట్ ఫిలిం థియేటర్ అసోసియేషన్ కి చెందిన కొంతమంది సభ్యులు తెలుగు ఇండస్ట్రీలో ప్రముఖులను విమర్శించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటి వ్యాఖ్యలను ఖండిస్తూ తాజాగా ఏటిఎఫ్ పీజీ..తెలుగు స్టేట్ ఫిలిం థియేటర్ అసోసియేషన్ ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యడం జరిగింది. ఆ నోట్ లో నిర్మాత తాను తీసిన సినిమా కచ్చితంగా థియేటర్లో రిలీజ్ చేయాలని అప్పట్లో పరిస్థితి ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి నిర్మాత.. థియేటర్లో లేదా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేసుకునే హక్కు ఉంది. ఇటువంటి తరుణంలో తెలుగు స్టేట్ ఫిలిం థియేటర్ అసోసియేషన్ కి చెందిన కొంతమంది.. తెలుగు సినిమా రంగంలో ప్రముఖులను విమర్శించటనీ అసోసియేషన్ ఖండించడం జరిగింది.
నిర్మాత తీసుకున్న నిర్ణయానికి.. ఆ సినిమాలో పనిచేసిన నటీనటులకు సంబంధం ఉండదని.. ఈ విషయములో అతిగా కొంతమంది రియాక్ట్ అవటం పై మండిపడ్డారు. ఏటిఎఫ్ పీజీ రిలీజ్ చేసిన తాజా లెటర్లో.. తెలుగు ఇండస్ట్రీ తో కలిసి పని చేయాలని అందరూ కలిసికట్టుగా ఉండాలని స్పష్టం చేశారు. ఈ మహామారి సృష్టించిన విధ్వంసానికి డిస్ట్రిబ్యూటర్లు,ఎగ్జిబిటర్లు… ఇంకా అనేకమంది.. వ్యాపారపరంగా చాలా నష్టం చూడటం జరిగిందని.. ఇండస్ట్రీలో ప్రతి సమస్యకు అందరూ కలిసికట్టుగా ఉండాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీ తో కలిసి పనిచేయడానికి తాము సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. అదేరీతిలో ఇటీవల అసోసియేషన్ కి చెందిన కొంతమంది.. ఇండస్ట్రీలో ప్రముఖ హీరోలపై అతిగా స్పందించడాని పరోక్షంగా ఖండించడం జరిగింది.