Atikamamidi Aaku: గతంలో ప్రతి ఒక్కరూ ఆహార నియమాలు పాటిస్తూ, శారీరక శ్రమ చేయడం వల్ల ఆరోగ్యంగా జీవించేవాళ్లు. ప్రస్తుతం ఆధునికత పేరుతో ఆహారం తీసుకునే విషయంలో మార్పులు రావడం, శారీరక శ్రమ లేకపోవడంతో అనేక రకాల రుగ్మతలు వస్తున్నాయి. గుండె జబ్బులు, కిడ్నీ వ్యాధుల సహా అనేక వ్యాధుల బారిన ప్రజలు పడుతున్నాడు. మన పూర్వీకులు ఏదైనా రుగ్మత వస్తే పది పైసలు ఖర్చు లేకుండా పెరటి మొక్కల వైద్యంతో నయం చేసుకునే వాళ్లు. ఇంటి పరిసరాల్లోని మొక్కల్లో ఎంతో అమూల్యమైన ఔషద గుణాలు దాగి ఉంటాయి. వేలు, లక్షల రూపాయలు ఖర్చుచేసినా నయంకాని వ్యాధులను తగ్గించే అద్భుత లక్షణాలెన్నో ఔషద మొక్కల్లో ఉన్నాయి. అలాంటి ఒక ఔషధ మొక్క అటిక మామిడి తీగ. ఇది గ్రామీణ ప్రాంతంలో విరివిగా పెరుగుతుంది.. దీనిని అంటుడు కాయ మొక్క అని కూడా పిలుస్తుంటారు.
ఈ అటిక మామిడి తీగ కిడ్నీ సమస్యలను తగ్గిస్తుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడినా, ఇతరత్రా వ్యాధులు వచ్చినా దీన్ని వాడితే మంచి ఫలితం ఉంటుందని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. కిడ్నీలు ఫెయిల్ అయి ఆఖరు దశ అయిన డయాలసిస్ వరకు వచ్చినా కూడా వారి ప్రాణాలను అటిక మామిడి రసంతో రక్షించవచ్చని ఆయుర్వేద నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అటిక మామిడి తీగను తెంచి ఆకులు, పువ్వులు, రెమ్మలు, వేర్లతో సహా సన్నని ముక్కలుగా చేసి 200 మిలీ నీటిని ఓ గిన్నెలో తీసుకుని సన్నని సెగపై 5 నుండి 0 నిమిషాలు మరిగించాలి. నీరు మరుగుతున్న సమయంలో అందులో అటిక మామిడి తీగ ముక్కలను వేయాలి. తర్వాత ఆకుల్లోని సారం దిగి రసంగా మారిన తర్వాత వడకట్టి రసం వరకు ఓ గ్లాసులోకి తీసుకోవాలి. ఈ రసాన్ని రోజూ ఉదయం 50మిలీ నీటిని తాగితే కిడ్నీ సంబంధిత వ్యాధుల నుంచి ఉపశమనం పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు.