Atmakur By Poll: రాష్ట్రంలో బీజేపీ – జనసేన పొత్తుతో ప్రయాణం చేస్తున్నామని చెబుతున్నా నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ ఉప ఎన్నికలోనూ బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇంతకు ముందు కడప జిల్లా బద్వేల్ లోనూ జనసేన మద్దతు లేకుండానే బీజేపీ పోటీ చేసింది. ఆత్మకూరు ఉప ఎన్నికల్లో దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబ సభ్యులకే వైసీపీ అభ్యర్ధిగా నిలిపిన నేపథ్యంలో గత సంప్రదాయాన్ని అనుసరించి జనసేన పోటీ చేయడం లేదని ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. టీడీపీ కూడా గత సంప్రదాయాన్ని గౌరవిస్తూ పోటీ చేయడం లేదని తెలిపింది. బీజేపీ మాత్రం తమ అభ్యర్ధిని ప్రకటించింది. జనసేన మద్దతు లేకుండానే బీజేపీ ఒంటరిగానే మరో సారి బరిలో దిగుతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
Atmakur By Poll: ఆరుగురు నేతల పేర్లు పరిశీలించి..
ఆత్మకూరు బీజేపీ అభ్యర్ధిత్వం కొరకు మొత్తం ఆరుగురు పేర్లను అధిష్టానానికి పంపగా బీసీ వర్గానికి చెందిన భరత్ కుమార్ ను తమ అభ్యర్ధిగా బీజేపీ ప్రకటించింది. భరత్ కుమార్ ప్రస్తుతం నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షుడుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కావలి పట్టణ అధ్యక్షుడుగా, బీజేవైఎం నేతగా పలు బాధ్యతలు నిర్వహించారు. భరత్ కుమార్ నేడు నామినేషన్ దాఖలు చేయనున్నారు. భరత్ కుమార్ బీసీ వర్గానికి చెందిన నాయకుడనీ, అసలైన సామాజిక న్యాయం బీజేపీ ద్వారానే సాధ్యమవుతుందని ఆ పార్టీ నేతలు అంటున్నారు.
నామినేషన్ ధాఖలు కార్యక్రమంలో సోము వీర్రాజు
భరత్ కుమార్ యాదవ్ నామినేషన్ దాఖలు పర్వంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు సహా పలువురు నేతలు పాల్గొంటున్నారు. ఇప్పటికే సోము వీర్రాజు నెల్లూరు చేరుకున్నారు. కాగా వైసీపీ అభ్యర్ధి మేకపాటి విక్రమ్ రెడ్డి ఇప్పటికే నామినేషన్ దాఖలు చేసి విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. గెలుపుపై ధీమాతో ఉన్న వైసీపీ నేతలు మెజార్టీపైనే అంచనాల్లో ఉన్నారు.