Atmakur By Poll: ఏపి దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన నెల్లూరు జిల్లా ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు సోమవారం నోటిఫికేషన్ జారీ అయ్యింది. నోటిఫికేషన్ జారీ కావడంతో నామినేషన్ల స్వీకరణ పర్వం ప్రారంభమైంది. తొలి రోజే రెండు నామినేషన్లు దాఖలు అయ్యాయి. పీపుల్స్ రిపబ్లిక్ పార్టీ నుండి గోదా రమేష్ కుమార్, నవతరం పార్టీ నుండి రావు సుబ్రమణ్యం నామినేషన్ లు దాఖలు చేశారు. జూన్ 6వ తేదీ వరకూ నామినేషన్లు స్వీకరిస్తారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు జూన్ 9గా నిర్ణయించారు. జూన్ 23న పోలింగ్ జరగనుంది. జూన్ 26న ఓట్ల లెక్కింపు నిర్వహించి అదే రోజు ఫలితాలను వెల్లడిస్తారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
గౌతమ్ రెడ్డి మరణంతో జరుగుతున్న ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే అవకాశాలు కనబడటం లేదు. ఇప్పటికే రెండు నామినేషన్లు దాఖలు కాగా ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ నేతలు పేర్కొన్నారు. టీడీపీ మాత్రం ఉప ఎన్నికల బరిలో అభ్యర్ధిని నిలుపుతుందా లేక గత సాంప్రదాయాన్ని అనుసరించి పోటీకి దూరంగా ఉంటుందా అనేది ఇంకా స్పష్టం చేయలేదు. వైసీపీ తరపున మాత్రం దివంగత మంత్రి గౌతమ్ రెడ్డి సోదరుడు మేకపాటి విక్రమ్ రెడ్డిని పోటీకి నిలపాలని మేకపాటి కుటుంబం నిర్ణయించింది.