అమరావతి: రాజధాని అమరావతిలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్తత కొనసాగుతోంది. రాజధానిని తరలించనున్నారని తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్న రైతులు తప్పుడు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ మీడియాపై దాడికి దిగారు. ఉద్దండరాయునిపాలెంలోని ప్రధాని మోదీ శంకుస్థాపన ప్రదేశంలో ముగ్గురు మీడియా ప్రతినిధులపై రైతులు దాడికి పాల్పడ్డారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ దాడిలో ఇద్దరు మీడియా ప్రతినిధులకు తీవ్ర గాయాలయ్యాయి. రైతుల ఆందోళనకు వ్యతిరేకంగా రెండు చానల్స్లో వార్తలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము పెయిడ్ ఆర్టిస్టులమా అంటూ మీడియాపై రైతులు మండిపడుతున్నారు.
రాష్ట్ర బిజెపి నేత కన్నా లక్ష్మీనారాయణ మౌన దీక్షను కవర్ చేసేందుకు మీడియా ప్రతినిధులు వెళ్లగా ఈ దాడి జరిగింది.