త్వరలో సంక్రాంతి రానుంది కదా. ఇంకేంటి.. ఎక్కడ చూసినా సందడే. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను ఎంత వైభవంగా జరుపుకుంటారో అందరికీ తెలిసిందే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంక్రాంతి పండగ హడావుడి మామూలుగా ఉండదు. ఇక.. టీవీ చానెళ్లు మాత్రం ఊరుకుంటాయా? తెలుగు ప్రేక్షకులకు సూపర్ డూపర్ ఎంటర్ టైన్ మెంట్ అందించేందుకు సిద్ధమయ్యాయి. ఈటీవీలో సంక్రాంతి నాడు అత్తో అత్తమ్మ కూతురో అనే ప్రోగ్రామ్ ప్రసారం కానుంది.
దీని కోసమని.. ముందుగానే సెట్ లో ట్రాక్టర్లు వేసుకొని బిగ్ బాస్ కంటెస్టెంట్లు రచ్చ రచ్చ చేశారు. ఇమ్ము, వర్ష ఒక ట్రాక్టర్ మీద, ఆటో రాంప్రసాద్, రోహిణి ఇంకో ట్రాక్టర్ మీద.. అనసూయ, హైపర్ ఆది మరో ట్రాక్టర్ మీద కాసేపు రైడ్ చేశారు.
అయితే.. అనసూయకు ట్రాక్టర్ డ్రైవింగ్ రాదట. అయినా కూడా దాని మీదికి ఎక్కేసి స్టార్ట్ చేసింది. పక్కనే హైపర్ ఆది కూర్చున్నాడు. తనకు డ్రైవింగ్ రాదని తెలిసి ఎంతలా భయపడ్డాడో తెలుసా? తను రేస్ చేసి ట్రాక్టర్ ను ముందుకు తీసుకెళ్తున్న కొద్దీ హైపర్ ఆది భయంతో వణికిపోయాడు.
చివరకు సెట్ వాళ్లు వచ్చి ట్రాక్టర్ ను ఆపేసేసరికి అంతా ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు. ఈ ప్రోమో చూస్తే మాత్రం మీరు కూడా పగలబడి నవ్వుకుంటారు. ఇంకెందుకు ఆలస్యం.. వెంటనే చూసేయండి మరి..