Atum 1.0 : దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హవా నడుస్తోంది.. ఒక వైపు పెట్రోల్ ధర ఆకాశాన్ని అంటుతోంది.. మరో పక్క వాయు కాలుష్యం.. దీంతో పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాలకు విపరీతంగా డిమాండ్ పెరిగింది.. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది..
ఫీచర్స్ :
అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం కూడిన అనేక ఫీచర్లతో ఈ బైక్ను తయారు చేశారు.
ఈ బైక్ గంటకు గరిష్టంగా 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీని బరువు 35 కేజీలు మాత్రమే. ఆటమ్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 48 ఓల్డ్ 250 watt లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పనిచేస్తుంది. ఈ బ్యాటరీ కేవలం నాలుగు గంటల్లోనే ఛార్జ్ అవుతుంది. ఈ బైక్ లో డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది .ఈ డిస్ప్లే లో బ్యాటరీ స్టేటస్, స్పీడ్, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాము వంటి విషయాలు గమనించవచ్చు.
ఈ బైక్ ను ఆటమ్ 1.0 గా పిలుస్తారు. ఈ బైక్ లాంచ్ అయినప్పటి నుండి ఇప్పటి వరకు 400 పైగా యూనిట్లో బుక్ చేసుకున్నట్లు సమాచారం. తాజాగా ఈ బైక్ డెలివరీలు ప్రారంభమయ్యాయి.కంపెనీ హైదరాబాద్ , న్యూ ఢిల్లీ , కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఆటమ్ 1.0 బైక్ ను అందించనుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ కి ఎటువంటి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు.. ఫైన్ ఇబ్బంది అంతకంటే లేదు.. ఇంకెందుకాలస్యం ఈ సారి మీరు బైక్ కొనుగోలు చేసేటప్పుడు ఫస్ట్ ఛాయిస్ ఎలక్ట్రిక్ బైక్స్ కి ఇవ్వండి..