లగ్జరీ కార్ అంటే ముందుగా గుర్తుకొచ్చేది ఆడి.. ఈ కార్లకున్న క్రేజే ప్రత్యకంగా చెప్పనవసరం లేదు.. లగ్జరీ కార్లలో ప్రయాణించాలి అనుకునే వారి మొదటి ఆప్షన్ ఆడీనే.. వాహన ప్రియులు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆడి ఏ4సెడాన్ ఎట్టకేలకు భారత్ మార్కెట్లో విడుదలైంది..! ఇప్పుడు తన సరికొత్త ఐదవ తరం ఆడి ఏ4 సెడాన్ ప్రీమియం ప్లస్, టెక్నాలజీ అనే రెండు వేరియెంట్స్ తో అందుబాటులో ఉంది.. అప్డేటెడ్ ఫీచర్స్, ఇంటీరియర్స్ తో అలరిస్తుంది ఈ ఆడి.. ! పూర్తి వివరాలు ఇలా..
ఫీచర్స్ :
ఇందులో 2.0 లీటర్ టిఎఫ్ఎస్ఐ పెట్రోల్ ఇంజన్ ఆప్షనల్ లో లభిస్తుంది. ఈ ఇంజన్ 188 బిహెచ్పిల శక్తిని 320 పీక్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 48 మైల్డ్ హైబ్రిడ్ సిస్టంతో పాటు 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్సు ను జతచేశారు. ఇంకా మ్యాట్రిక్స్ హెడ్ లంప్స్ ను అదనంగా అందిస్తుంది. ఈ సెడాన్ ఆల్-డిజిటల్ వర్చువల్ కాక్ పిట్ ను కలిగి ఉంటుంది. ఇందులో 10.1 ఇంచ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టం, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ , ఎబిఎస్, యాంబియాంటి లైటింగ్ ఫీచర్స్ ఉన్నాయి..
ఇందులో క్యాబిన్ స్పేస్ ఎక్కువగా ఉంది. ఫ్రంట్ & రిర్ బంపర్స్, 18- ఇంచ్ ప్రీమియం అల్లాయ్ వీల్స్ , ఎల్ఈడి టైయిల్ లైట్స్, డ్యూయల్ ఎగ్జాస్ట్ ఉన్నాయి. కాస్మెటిక్ అప్గ్రేడెడ్ కనెక్టింగ్ టెక్నాలజీ సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యూనిట్ కి స్టాండర్డ్ తో వచ్చింది. కేవలం 7.3 సెకన్లలో 0 నుంచి 100 కిలోమీటర్ల వేగంవంతం అవుతుంది. ఏ సిరీస్ లో అత్యధికంగా అమ్ముడయ్యే వాటిలో ఏ4 ఒకటి. ఇది బిఎమ్ డబ్ల్యూ 3 సిరీస్, జాగ్వర్ ఎక్సే ఈ, మెర్సిడెస్ బెంజ్ సి-క్లాస్ వంటి మోడళ్లకు ప్రత్యర్థిగా నిలుస్తుంది. ఈ కారు బుకింగ్స్ ను కొన్ని వారాల క్రితమే ప్రారంభించింది. ఆన్లైన్ ద్వారా కూడా బుకింగ్స్ చేసుకునే సదుపాయం కల్పించింది.