దశాబ్దాల కాలంగా ఆగస్టు నెల అంటేనే టిడిపి వెన్నులో వణుకు పుడుతుంది. చారిత్రాత్మకంగా ఆగస్టు నెల టిడిపికి అస్సలు కలిసి రాదు. చాలా ఏళ్ళపాటు ఆగస్టు నెల టిడిపి రాజకీయ చరిత్రలో చీకటి నెలలా నిలిచింది. 1995లో ఎన్టీఆర్ కి చంద్రబాబు దెబ్బ కొట్టింది ఆగస్టు నెలలోనే. అలాగే 1954 ఆగస్టు లో నాదెండ్ల భాస్కరరావు అన్నగారికి వెన్నుపోటు పొడిచారు. ఇక 2000 ఆగస్టు కూడా చంద్రబాబు కి పొలిటికల్ షాక్ తగిలింది. విద్యుత్ ఉద్యమానికి వామపక్షాలు, కాంగ్రెస్ శ్రీకారం చుడితే అదే నెల 29వ తేదీన ఉద్యమకారులను టిడిపి కాల్చి చంపారన్న తీవ్ర ఆరోపణల మధ్య కేసీఆర్ ఉపాసభాపతి పదవికి రాజీనామా చేసి టీడీపీ కి పోటిగా టిఆర్ఎస్ పెట్టారు.
అలా ఆగస్టు నెలలో టిడిపి సర్వం కోల్పోయిన సందర్భాలెన్నో. అందుకే ఆగస్టు అంటేనే టీడీపీకి వెన్నులో వణుకు పుడుతుంది. ఇదిలా ఉండగా 2020 ఆగస్టు కూడా తెలుగుదేశానికి బాగా గుర్తుండిపోయేలా ఉంది. పార్టీ పట్ల పట్ల తీవ్రమైన అసహనంతో ఉన్న మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున వైసీపీకి తరలి వెళ్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా వైసీపీ లో చేరడానికి రెడీ అయిన గంటాఅ శ్రీనివాసరావు అతనితోపాటు తన అనుచర దళానికి కూడా వైసీపీ కండువా కప్పేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. ఉత్తరాంధ్రలో టీడీపీకి వారంతా ఎంతో ముఖ్యం. గంటా పోకడతో వారు అధికారికంగా వైసిపి టిడిపి నేతలకు సహకారం అందించే అవకాశం అయితే లేనేలేదు.
ఇదిలా ఉంటే గంటా టీడీపీని వదిలి వెళ్లనుండడం రాజకీయంగా పెద్ద సంచలనం. ఆగస్టు 8న క్విట్ ఇండియా రోజు లేదా ఆగస్టు 15న గంటా వైసీపీ లోకి చేరాలి అని అనుకుంటున్నారు. దానికితోడు విశాఖలో పరిపాలన రాజధానిని ఏర్పాటు చేయనున్నారని…. దానికి మద్దతుగా తాను ప్రాంతీయ అభిమానంతో టీడీపీని వదిలి వెళుతున్నానని గంటా గట్టిగా చెబుతున్నారట. అది చంద్రబాబు అమరావతి నినాదానికి అతి పెద్ద బ్రేక్ అనే చెప్పాలి. ఇదే వరసలో మరింతమంది తమ్ముళ్ళు టీడీపీని వీడుతూ బాబు విధానాలను దుయ్యబెడతారుట. ఆగస్టు సంక్షోభం లో భాగంగా గంటా తనతో పాటు మరికొంతమందిని వైసిపిలో చేఎచేందుకు ప్రయత్నిస్తున్నారని…. ఇదే వరుసగా మరింతమంది తమ్ముళ్లు టీడీపీని వదిలి బాబుకి గుడ్ బై చెప్పబోతున్నారట. కాబట్టి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏపీలో టిడిపికి ఆగస్టు నెల అతి పెద్ద దెబ్బ వేయబోతోందన్నమాట.