మెల్బోర్న్(ఆస్ట్రేలియా),జనవరి 18: టీం ఇండియాతో జరుగుతున్న చివరి వన్డే క్రికెట్ మ్యాచ్లో ఆసీస్ జట్టు 40 ఓవర్లలో 190 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. మూడు వన్డేల సీరీస్లో భాగంగా భారత్ జట్లు అఖరి వన్డేలో ఆత్యిధ్య జట్టుతో మెల్బోర్న్ గ్రౌండ్లో శుక్రవారం తలపడుతోంది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత జట్టు పేసర్ భువనేశ్వర్ ఓపెనర్లు కారే, ఫించ్ లను అవుట్ చేయడంతో 10 ఓవర్లలోనే ఆసీస్ ఓపెనర్లను కోల్పోవాల్సి వచ్చింది. అనంతరం స్పిన్నర్ ఛాహల్ స్పిన్కు మార్ష్, స్టోయిన్స్ , ఖ్వాజా వికెట్లు సమర్పించుకున్నారు. షమీ మ్యాక్స్ వెల్ను ఔట్ చేశాడు. హాండ్స్ కాంప్ , రిచర్డ్సన్ క్రీజ్లో ఉన్నారు.
ఈ సీరీస్లో 1-1 స్కోరుతో ఇరు జట్లు సమానంగా ఉన్నాయి. ఈ మ్యాచ్ ఫలితంతో సిరీస్ ఎవరిదో తేలిపోతుంది.
previous post
next post