ప్రముఖ వివాదాస్పద రచయిత, బుకర్ ప్రైజ్ విజేత సల్మాన్ రష్దీ పై న్యూయార్క్ లో ఓ ఆగంతకుడు దాడికి పాల్పడ్డాడు. అమెరికా న్యూయార్క్ లోని చౌతాక్వా ప్రాంతంలోని ఓ ఇనిస్టిట్యూట్ లో సమావేశానికి సల్మాన్ రష్దీ (75) హజరై ప్రసంగానికి సిద్ధమవుతుండగా వేదికపైకి దూసుకువచ్చిన ఓ ఆగంతకుడు కత్తితో రష్దీ పై దాడి చేశాడు. కత్తిపోట్లకు గురైన రష్దీ అక్కడికక్కడే కుప్పకూలిపోగా ఆయనను హుటాహుటిన హెలికాఫ్టర్ లో ఆసుపత్రికి తరలించారు. అయితే ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది తెలియరాలేదు. రష్దీపై కత్తితో దాడి చేసిన ఆగంతకుడిని న్యూయార్క్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
1947లో ముంబాయిలో జన్మించిన సల్మాన్ రష్దీ కొన్నాళ్ల తర్వాత బ్రిటన్ కు తరలివెళ్లి స్థిరపడ్డారు. రష్దీ రచించిన మిడ్ నైట్ చిల్డ్రన్ నవలకు 1981లో ప్రతిష్టాత్మక బుకర్ ప్రైస్ దక్కడంతో ఆయన ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందారు. అయితే ఆయన రచించిన పలు నవలలు వివాదాస్పద మైయ్యాయి. ప్రధానంగా 1980లో రచించిన ది సాతానిక్ వెర్సెస్ నవల వివాదాలకు కేంద్ర బిందువు అయ్యింది. ఇస్లామిక్ ఛాందస వాదులను ఈ నవల తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది. రష్జీ దైవ దూషణకు పాల్పడ్డారంటూ అతనిపై నిప్పులు చెరిగారు. హత్య బెదిరింపులు ఆయనకు వచ్చాయి. మతాన్ని కించపరుస్తుందంటూ 1988లో ఆయన నవలను ఇరాన్ లో నిషేదించారు. రష్దీపై ఇరాన్ నేత ఆయతుల్లా ఖోమేనీ ఫత్వా కూడా జారీ చేశారు. రష్దీ ని హత్య చేసేందుకు ఇరాన్ మూడు మిలియన్ డాలర్ల నజరానా కూడా ప్రకటించింది.
ఎస్సీ, బీసీ: టీడీపీకి పొలిటికల్ దెబ్బ..! జగన్ వేసిన ఉచ్చు.. టీడీపీకి నష్టం తప్పదా..?