అయోధ్య సాక్షిగా రామ మందిరం నిర్మాణానికి మోడీ పునాది రాయి వేయటంతో, ప్రపంచవ్యాప్తంగా ఉన్న రామభక్తులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్ని శతాబ్దాల కల భారతీయ చరిత్రలో ఆగస్టు 5వ తారీఖున చోటుచేసుకుందని “జైశ్రీరామ్” నామస్మరణతో సోషల్ మీడియాలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులు శుభాలు పలుకుతున్నారు. అయితే తాజాగా ఈ కార్యక్రమంపై పాకిస్తాన్ మాజీ క్రికెటర్ డానిష్ కనేరియా ట్విట్టర్లో స్పందించారు. శ్రీ రాముడి అందం ఆయన పేరులో కాకుండా, ఆయన వ్యక్తిత్వం లో ఉందని పేర్కొన్నాడు. చెడు పై ఎల్లప్పుడూ మంచే గెలుస్తుందని చెప్పటానికి రాముడు ఒక నిదర్శనం అని అన్నాడు.
అయోధ్యలో రామమందిరం భూమి పూజ తో ప్రపంచంలో ఎంతోమంది హిందువుల కల నెరవేరిందని… రామ మందిరానికి పునాదిరాయి పడటంతో హిందువుల ఆత్మసంతృప్తి ఈ భూమి పూజ ఓ గొప్ప కార్యం అని తెలిపాడు. దీంతో రాముడిపై డానిష్ కనేరియా చేసిన వ్యాఖ్యలు.. సోషల్ మీడియాలో వైరల్ కావటంతో చాలా మంది నెటిజన్లు ఏం చెప్పావు బ్రో అంటూ రిప్లై ఇస్తున్నారు.
ఇదిలా ఉండగా మ్యాచ్ ఫిక్స్ ఆరోపణలతో డానిష్ కనేరియా ఇదే సందర్భంలో ట్విట్టర్లో స్పందిస్తూ… కాంట్రవర్సి కామెంట్లు చేశారు. తాను హిందువు అయినందునే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుండి సరైన మద్దతు రావడంలేదని చెప్పుకొచ్చాడు. పాకిస్థాన్ ఆటగాడు మూడేళ్ల నిషేధాన్ని పీసీబీ ఇటీవల సగానికి తగ్గించింది. కానీ తనపై మాత్రం కఠినంగా వ్యవహరిస్తుందని పాకిస్థాన్ క్రికెట్ బోర్డుపై డానిష్ కనేరియా అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?