అయోధ్యలో ఆలయ నిర్మాణ శంకుస్థాపన తేదీ ఖరారు అయింది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమి పూజకు ముహూర్తం ఫిక్స్ అయ్యింది. ట్రస్ట్ పంపించిన రెండు తేదీలలో ఒక తేదీని పి ఎం ఓ ఫైనల్ చేసినట్టు తెలుస్తోంది.
వివాదాస్పద రామ జన్మభూమి విషయంలో సుదీర్ఘ కాలం విచారణ జరిపి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇచ్చిన అనంతరం ఆలయ భూమి పూజకు సంబందించిన పనులు చెకచెకా జరుగుతున్నాయి. కరోనా లాక్ డౌన్ కారణంగా నెలల పాటు స్తబ్దత నెలకొన్నది. తిరిగి ఇప్పుడు ఆ పనులు ఊపందుకున్నాయి.
రాామాలయం నిర్మాణానికి శంకుస్థాపన చేయాల్సి ఉంది. అయితే సాక్షాత్తూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా భూమిపూజ చేయించాలని ట్రస్ట్ ప్రతినిధుల తో పాటు అయోధ్యలోని సాధువుల నిర్ణయించారు. వారు పంపిన భూమిపూజ ఆహ్వానానికి మోడీ అంగీకరించారు. దీనితో ప్రధాన మంత్రి కార్యాలయానికి ట్రస్ట్ కమిటీ రెండు తేదీలను సూచిస్తూ లేఖ పంపించింది. ఆగస్టు 3 లేదా ఆగస్టు 5 ముహూర్తపు తేదీలను సూచిస్తూ రెండు తేదీల్లో ఒకదానికి ఫైనల్ చేయమంటూ ప్రధాన మంత్రికి ఆహ్వానం పంపించామని ట్రస్ట్ సభ్యులు తెలిపారు. ఈ రెండు తేదీల్లో ఆగస్టు 5 ముహూర్తానికి ప్రధాని కార్యాలయం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు సమాచారం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్టు 5 ఉదయం 11 గంటలకు ప్రధాని మోదీ అయోధ్య చేరుకుంటారు.
అయోధ్యలో రామాలయం నిర్మాణానికి భూమి పూజ అనంతరం హనుమాన్ టెంపుల్, సరయూ నదిని ప్రదాని మోదీ సందర్శిస్తారని సమాచారం. భూమి పూజ అనంతరం అయోధ్య అభివృద్ధికి సంబంధించిన పలు శంకుస్థాపన కార్యక్రమాల్లో మోడీ పాల్గొననున్నారు.
2014 లో దేశ ప్రదాన మంత్రి గా మోడీ బాధ్యతలు స్వీకరించిన తరువాత అయోధ్యను సందర్శించడం ఇదే తొలిసారి.