Ayyappa swamy: నల్లని రంగు
అయ్యప్ప స్వామి ( Ayyappa Swamy ) దీక్ష లో నల్లని వస్త్రాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. నల్లని దుస్తులు ధరించి మణిమాలలు మెడలో వేసుకుని దీక్ష చేయడం మొదలు పెడతారు. శనీ భగవానుడికి నల్లని రంగు అంటే మహా ప్రీతి. ఆ రంగు బట్టల తో నిత్య పూజ లు చేసేవారి మీద శనిప్రభావం పడదని చెబుతారు. దీనితో పాటు అయ్యప్ప మాల వేసుకునేది చలి కాలం కావడం వలన ఈ సమయంలో నల్లని వస్త్రాలు శరీరానికి చలి లేకుండా వెచ్చదనాన్ని ఇస్తాయి.
Ayyappa swamy: ప్రతి జీవిలోను దేవుడు
ఇక దీక్షలో మరో భాగంగా మాలధారులు మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం, పగడాలు, తామర పూసల మాలలు వంటివి వేసుకుంటారు. ఈ మాలలు శరీర ఆరోగ్యం ( Health )తో పాటు మానసికోల్లాసం ఇస్తాయి. ఈ మాలలు వేసుకునే ముందు అభిషేకం చేసి మంత్రఛ్చారణ వాటి లోకి అయ్యప్ప స్వామిని ఆవాహనం చేసి త్రికరణశుద్ధిగా స్వామిని సేవిస్తున్నా అని చెప్పి మరి వేసుకుంటారు. ఇక వారు పెట్టుకునే గంధం విషయానికొస్తే కనుబొమ్మల మధ్య లో సుషుమ్న అనే నాడి ఉంటుంది. ఈ నాడి జ్ఞానాన్ని అందిస్తుంది కాబట్టి దాన్ని ఉత్తేజితం చేయడానికి అక్కడ గంధం, కుంకుమ పెట్టుకోవాలి అని చెబుతారు. ప్రతి జీవిలోను దేవుడున్నాడనే భావంతో ఎవరినయినా “స్వామి” అని మాత్రమే పిలవాలని అయ్యప్ప దీక్షలో ఒక నియమాన్ని పెట్టారు. ఇటు శరీరాన్ని, అటు మనస్సును ఆదీనం లో ఉంచుకుని మంచి మార్గం లో వెళ్లేలా చేసేదే అయ్యప్ప స్వామి మండల దీక్ష. రేపు మాల వేసుకుంటాము కదా అని ఈ రోజు మద్యం, మాంసం స్వీకరించడం లాంటివి అస్సలు చేయకూడదు. మాల వేసుకోవడానికి కనీసంనాలుగు రోజుల ముందు నుంచే నిష్ఠగా ఉండాలి.
అయ్యప్పలకు
దురలవాట్లకు దూరంగా ఉండి తీరాలి. మాలధారణ చేయడానికి తల్లిదండ్రులు, భార్య యొక్క అంగీకారం తప్పనిసరిగా ఉండాలి. జుట్టు,గోళ్లు ముందుగానే కట్ చేసుకుని ఉండాలి ఎందుకంటే దీక్షలో ఉండగా ఆ పనులు చేయడానికి వీల్లేదు. తమకి ఉన్న శక్తి కొదలది ఒక్కసారైనా ఐదుగురు అయ్యప్పలకు భిక్ష పెట్టాలి. తల్లిదండ్రులు మరణిస్తే సంవత్సరం పాటు,భార్య మరణిస్తే ఆరునెలల పాటు దీక్ష కు దూరంగా ఉండాలి