NewsOrbit
న్యూస్

వామ్మో! బాబా వాంగ చెప్పింది!వచ్చే ఏడాది ఇంకా భయంకరంగా ఉంటుందట!!

ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా జ్యోతిష్కులు చెప్పిన ఎన్నో విషయాలు వాస్తవ రూపాన్ని దాల్చాయి. మరికొన్ని భవిష్యత్‌లో జరగబోయేవీ ఉన్నాయి. అలా భవిష్యత్‌ను ఊహించి చెప్పిన వారిలో మన వరకు.. మన తెలుగు వ్యక్తి అయిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి మాత్రమే తెలుసు.

కానీ, ఆయన లాంటి వాళ్లు ప్రపంచంలో ఎంతో మంది ఉన్నారు. వారిలో ముఖ్యంగా చెప్పుకోవాలంటే బల్గేరియాకు చెందిన కంటి చూపు లేని బాబా వాంగ పన్డేవా. భవిష్యవాణికి సంబంధించి ఈవిడ చెప్పిన చాలా వరకు పరిణామాలు వాస్తవ రూపం దాల్చాయి. అందులో కరోనా మహమ్మారి కూడా ఒకటి. ఈ నేపథ్యంలో ఆమె జోస్యం మరోసారి ప్రాచుర్యంలోకి వచ్చింది. 2020 సంవత్సరంలో అతలాకుతలం అయిన జన జీవనం.. 2021లో మరింత అస్తవ్యస్తంగా మారనుందని బాబా వాంగ ప్రకటించారు.

ఈ బాబా వాంగ ఎవరు..?

బల్గేరియాలోని పెట్రిచ్‌లో 1911, జనవరి 31న జన్మించిన బాబా వాంగ.. 1996 ఆగస్టు 11న పరమపదించారు. 12 ఏళ్ల వయసులో ఓ టోర్నడోలో కొట్టుకుపోయిన వాంగా.. ప్రాణాలతో బయటపడ్డారు. అయితే కళ్లలో ఇసుక పడటంతో ఆమె చూపు కోల్పోయారు. అయితే ఒకరోజు తన తండ్రి సాకుతున్న గొర్రెల మంద నుంచి ఓ గొర్రెను దొంగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వాంగ.. దొంగల వివరాలను, ఆ గొర్ర ఉన్న చోటును పూసగుచ్చినట్లు వెల్లడించింది వాంగ. అలా తన 16 ఏట నుంచి వాంగ భవిష్యవాణి చెప్పడం ప్రారంభించారు. 30 ఏళ్ల నాటికి ఆమె శక్తులు మరింత బలీయమయ్యాయి. ఆమె మాటలను బల్గేరియా వాసులు పూర్తిగా విశ్వసించేవారు. ఎన్నో జోస్యాలు నిజం కావడంతో ప్రజలు వాంగను ‘నోస్ట్రడామస్‌ ఆఫ్‌ ద బాల్కన్స్‌’గా పిలవడం మొదలుపెట్టారు. జర్మనీ నియంత హిట్లర్‌ సైతం ఓసారి పన్డేవాను పిలిచారనే ప్రచారం ఉంది. అమెరికాలోని ట్విన్ టవర్స్‌ను కూల్చేస్తారని 1989లో వాంగ చెప్పారు. చివరకు అదేజరిగింది. ఇక 2016లో యూరప్‌పై ముస్లింల దాడికి గురించి వాంగ 1996కు ముందే చెప్పారు. ఈ దాడి యుద్ధానికి దారి తీసి చాలా మంది మృత్యువాత పడతారని వాంగ పన్డేవా అప్పట్లోనే ప్రకటించారు. ఆమె నాడు చెప్పిన అంశం 2016లో యధావిధంగా జరిగింది.2004లో సునామీ వస్తుందని కూడా ఆమె ముందే చెప్పారు.ఆమె చెప్పినవన్నీ జరగలేదు కానీ.. 68శాతం వరకు నిజం అయ్యాయని పలువురు వాదిస్తుంటారు.

2021 గురించి వాంగ ఏం చెప్పారంటే ?

2021లో డ్రాగన్ (చైనా) ఈ ప్రపంచాన్ని తన గుప్పిట్లో పెట్టుకుంటుంది. దానికి వ్యతిరేకంగా మూడు భారీ దేశాలు ఒక్కటవుతాయి.2021లో చాలా వినాశకాలు జరుగుతాయి. విపరీతమైన ప్రకృతి విపత్తులు సంభవిస్తాయి.2021లో క్యాన్సర్‌కి మందును కనుక్కుంటారు.వాంగా చెప్పిన వీటిలో ఎన్ని నిజమవుతాయో చూద్దాం!

 

author avatar
Yandamuri

Related posts

Telangana Congress: ఖమ్మం లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్ధిగా రఘురామిరెడ్డి .. ఎవరీ రఘురామిరెడ్డి..?

sharma somaraju

Breaking: ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ

sharma somaraju

YS Jagan: వైసీపీ మ్యానిఫెస్టో ఎలా ఉంటుందో చెప్పిన సీఎం జగన్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?

sharma somaraju

AP High Court: వాలంటీర్ల రాజీనామాల పిటిషన్ పై హైకోర్టులో విచారణ ..కౌంటర్ దాఖలునకు ఈసీకి నోటీసులు

sharma somaraju

YSRCP: కూటమికి బిగ్ షాక్ .. జగన్ సమక్షంలో కీలక నేతలు వైసీపీలో చేరిక

sharma somaraju

Ravi Teja: కేవ‌లం 5 రోజుల్లో షూటింగ్ పూర్తి చేసుకుని బాక్సాఫీస్ వ‌ద్ద హిట్ గా నిలిచిన ర‌వితేజ సినిమా ఏదో తెలుసా!

kavya N

చిన్న‌మ్మ దెబ్బ‌తో ఏపీ క‌మ‌లంలో క‌ల్లోలం… పెద్ద ముస‌లం…!

Bhimaa: మ‌రికొన్ని గంట‌ల్లో ఓటీటీలోకి వ‌చ్చేస్తున్న గోపీచంద్ భీమా.. స్ట్రీమింగ్ డీటైల్స్ ఇవే!

kavya N

Kiara Advani: కియారా అద్వానీ న‌టి కాక‌ముందు డ‌బ్బు కోసం ఎలాంటి ప‌నులు చేసేదో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Stone Attack On Jagan: జగన్ పై హత్యాయత్నం కేసులో నిందితుడి కస్టడీకి కోర్టు అనుమతి ..షరతులు ఇవి

sharma somaraju

Supreme Court: మరో సారి బహిరంగ క్షమాపణలు చెప్పిన పతంజలి ..సుప్రీం కోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

Varsham: వ‌ర్షం మూవీలో అస‌లు హీరోయిన్ త్రిష కాదా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్ని..?

kavya N

Pawan Kalyan: ప‌వ‌న్ క‌ళ్యాణ్ అప్పులు అక్ష‌రాల రూ. 64.26 కోట్లు.. మ‌రి ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

ఇద్ద‌రు బీసీల మ‌ధ్య‌లో రెడ్డి… తెలంగాణ‌లో ఆ ఎంపీ సీట్లో విన్న‌ర్ ఎవ‌రో…?