చంద్రబాబు అధికారంలో ఉన్నంత కాలం పార్టీలో ఉన్న నాయకులకే అందుబాటులో లేరని ఓడిపోయిన తర్వాత చాలా కామెంట్లు వచ్చాయి.ఏమాత్రం చంద్రబాబు పట్టించుకోలేదని అందువల్లే తెలుగుదేశం కి గత సార్వత్రిక ఎన్నికలు అట్టర్ ఫ్లాప్ ఫలితాలు వచ్చినట్లు విశ్లేషణలో సొంత పార్టీ నుండి వచ్చాయి. ఈ క్రమంలో ప్రతిపక్షంలో ఉన్నా గాని మొన్నటి వరకు చంద్రబాబు కార్యకర్తలు పట్టించుకోని పరిస్థితి.
ఇదిలా ఉండగా తాజాగా ఏమైందో ఏమో తెలియదు కానీ చంద్రబాబు ఒక్కసారిగా కార్యకర్తలపై ప్రేమ చూపిస్తున్నట్లు టాక్ నడుస్తోంది. పూర్తి విషయంలోకి వెళ్తే వచ్చే ఎన్నికల నాటికి పార్టీ బలపడాలంటే ఖచ్చితంగా కార్యకర్తల కృషి ఎంతో ఉండాలని వారి సపోర్టు లేనిదే గెలిచే పరిస్థితి లేదని చంద్రబాబు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.
దీంతో వచ్చే సార్వత్రిక ఎన్నికలకు టిడిపి పార్టీ ని అన్ని విధాలా బలపరిచే రీతిలో ఇటీవల 175 నియోజకవర్గాలకు గాను 300 మందికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యవర్గంలో చోటు కల్పించే రీతిలో చంద్రబాబు నిర్ణయం తీసుకోవడం జరిగింది. వీళల్లో ఎక్కువగా పార్టీ తరఫున ఎప్పటినుండో పనిచేసిన వారు కావడం విశేషం. దీంతో బాబు నిర్ణయాల ప్రకారం ఫోకస్ మొత్తం పార్టీ కార్యకర్తలపై పెట్టినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పార్టీ కార్యకర్తలతో ఎప్పటికప్పుడు రాబోయే రోజుల్లో సమావేశాలలో కూడా చంద్రబాబు పాల్గొన్న బోతున్నట్లు టాక్ నడుస్తోంది.