తెలంగాణ రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని ప్రధాన పార్టీలు రెడీ అవుతున్నాయి. ఎన్ని పార్టీలు బరిలో ఉన్నా గాని పోటీ మాత్రం టిఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ పార్టీల మధ్య నువ్వా నేనా అన్నట్లు గా ఉంది అనే వార్తలు తెలంగాణ పాలిటిక్స్ లో వినబడుతున్నాయి. ముఖ్యంగా దుబ్బాక ఉప ఎన్నికలలో బిజెపి గెలవడంతో గ్రేటర్ ఎన్నికల లో కూడా విజయం సాధించాలని అందివచ్చిన ప్రతి అవకాశాన్ని అందుకుంటూ ముందుకు సాగుతోంది.
ఇదిలా ఉండగా గ్రేటర్ పరిధిలో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రచార కార్యక్రమాల బాధ్యతను టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ కి అప్పజెప్పే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసు తర్వాత టిడిపి పార్టీని పెద్దగా చంద్రబాబు పట్టించుకోలేదు అనే టాగ్ ఎప్పటి నుండో ఉంది.
కానీ పార్టీ కేడర్ ఉండటంతో గత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో కలసి పోటీకి దిగిన చంద్రబాబు ఎన్నికల ఫలితాలు దారుణంగా రావడంతో మొన్నటి వరకూ తెలంగాణ టిడిపి క్యాడర్ తో భేటీ అయిన సందర్భాలు లేవు. అయితే గ్రేటర్ ఎన్నికలు రావడంతో ఇటీవల తెలంగాణ టిడిపి పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబును కలిసి మంతనాలు జరిపి పోటీకి అన్ని విధాలా రెడీ అయ్యారు. చాలావరకు హైటెక్ సిటీ అదేవిధంగా మరికొన్ని ప్రాంతాలలో టీడీపీకి పట్టు ఉండటంతో జరగబోయే ఎన్నికలలో ఆయా చోట్ల ప్రచారానికి సంబంధించి నందమూరి ఫ్యామిలీ తో పాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కూడా రంగంలోకి దించి ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్లు టాక్ వస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే పార్టీ అధిష్టానం నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉందని వార్తలు వైరల్ అవుతున్నాయి.