గత కొంతకాలంగా మంచు ఫ్యాలీలో హీరోలైన మంచు విష్ణు, మంచు మనోజ్ లకి సరైన హిట్స్ లేవన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సోదరులిద్దరు ఒకేసారి పాన్ ఇండియన్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ సినిమాల బడ్జెట్ ఏ 150 కోట్ల తోనో 200 కోట్ల తోనో నిర్మించడం లేదు. ఒక్కో సినిమా బడ్జెట్ 100 కోట్ల లోపే అంటున్నారు. ఇంకా చెప్పాలంటే 70 కోట్ల లోపే హై టెక్నికల్ వ్యాల్యూస్ తో పాన్ ఇండియన్ సినిమాలుగా రూపొందిస్తున్నాయి.
మంచి మనోజ్ అహం బ్రహ్మాస్మి సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా చాలా వైవిధ్యభరితమైన కథ తో తెరకెక్కుతుంది. అఘోరా మనోజ్ నటిస్తున్నాడని సమాచారం. ఎంఎం ఆర్ట్స్ అనే సొంత నిర్మాణ సంస్థ లో మనోజ్ ఈ సినిమాని 30 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడట. ప్రియా భవాని శంకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాని తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మిస్తున్నారు.
ఇక మంచు విష్ణు మోసగాళ్ళు అన్న సినిమా చేస్తున్నాడు. కాజల్ అగర్వాల్, బాలీవుడ్ నటుడు సునీల్ శెట్టి ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. విష్ణు–కాజల్ అగర్వాల్ ఈ సినిమాలో అన్నా చెల్లెళ్లుగా నటిస్తుండటం విశేషం. ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ కుంభకోణం నేపథ్య కథాంశంతో ఈ సినిమాని రూపొందిస్తున్నారు. కాగా దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి టీజర్ ని రిలీజ్ చేయనున్నారు.
అలాగే మంచు మోహన్ బాబు కూడా రీసెంట్ గా ఒక సినిమాని ప్రకటించారు. సన్ ఆఫ్ ఇండియా అన్న టైటిల్ తో ఈ సినిమా రూపొందుతుంది. ఈ సినిమా శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్ ఫ్యాక్టరీ సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ మాటల రచయత డైమండ్ రత్నబాబు ఈ సినిమాతో దర్శకుడిగా మారబోతున్నాడు. ఇక ఈ సినిమా నుంచి మోహన్ బాబు ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది.