కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చెందిన పెద్ద సంఖ్యలో రైతాంగం 45 రోజులకుపైగా ఢిల్లీ వద్ద ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. నూతన వ్యవసాయ బిల్లులు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటి నుండి పై రెండు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున రైతాంగం ఆందోళన చేస్తున్నాయి. ఈ తరుణంలో హర్యానాలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు బీజేపీకి షాక్ ఇచ్చారు. రాష్ట్రంలో మూడు మున్సిపల్ కార్పోరేషన్లకు ఎన్నికలు జరగ్గా రెండు కార్పోరేషన్ లలో కాంగ్రెస్ కూటమి ఘన విజయం సాధించింది. రేవారి మున్సిపల్ కౌన్సిల్, మూడు మున్సిపల్ కమిటీలకు ఎన్నికలు జరగ్గా రేవారిలో బీజెపీ గెలుపొందింది. మిగిలిన స్వతంత్రులు దక్కించుకున్నారు.
తొలి సారిగా అంబాలా, పంచకుల, సోనిపట్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ ఎన్నికలను ప్రత్యక్ష పద్ధతిలో నిర్వహించారు. వీటితో పాటు దరోహర (రేవారి), సంప్లా (రోహతక్), హిసార్ (ఉక్లాన్) మున్సిపాలిటీలకు ఈ నెల 27న పోలింగ్ జరగ్గా బుధవారం ఓట్ల లెక్కింపు నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంవత్సరం తరవాత జరిగిన తొలి ఎన్నికలు కావడంతో అన్ని రాజకీయ పార్టీలు ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికార బీజెపీ, జన నాయక్ జనతా పార్టీ (జెజెపి, ఉప ముఖ్యమంత్రి దుష్వంత్ చౌతాలా) కూటమి ఒక వైపు, కాంగ్రెస్ కూటమి మరో వైపు ఎన్నికల బరిలో నిలిచాయి. రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దు సమీపంలో గల సోనిపట్ మేయర్ స్థానాన్ని 14వేల ఓట్ల భారీ మెజార్టీతో కాంగ్రెస్ గెలుచుకుంది. నిఖిల్ మదన్ తొలి మేయర్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. అంబాలాలో కాంగ్రెస్ కూటమమిలోని హర్యానా జన చైతన్య పార్టీ (హెచ్జెపీ)కి చెందిన కేంద్ర మాజీ మంత్రి వినోద్ శర్మ సతీమణి శక్తి రాణి శర్మ మేయర్ కానున్నారు. దరుహెరాలో, ఉక్లాన్ లో బీజెపి ఓటమి చెందగా స్వతంత్ర అభ్యర్థులు గెలుపొందారు. సంప్లాలో బిజేపీ అభ్యర్థిపై స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. పంచకులలో బీజేపీ కూటమి గెలిచింది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?