పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. భారతీయ సినీ చరిత్రలో ఆయనొక సంచలనం. ఎందుకంటే, ఆయన హీరోగా నటించిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికీ.. తన నటనా స్టైల్ తో ప్రత్యేకమైన ఎనలేని గుర్తింపు సంపాదించుకున్నారు. అక్కడ అమ్మాయి-ఇక్కడబ్బాయి సినిమాతో వెండితెర ప్రయాణం మొదలుపెట్టారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. ఆ తరువాత ఆయన హీరోగా వచ్చిన తమ్ముడు, బద్రి, ఖుషి వంటి సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తూ.. పవర్ స్టార్ గా ఎదిగారు.
చివరగా “అజ్ఞాత వాసి”గా ప్రేక్షకులను అలరించిన పవర్ స్టార్.. రాజకీయ పార్టీని స్థాపించి.. అక్కడ బిజీ అయ్యారు. అయితే, జరిగిన ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో ఫలితాలు రాకపోవడంతో.. సినిమాలల్లో నటిస్తూనే, రాజకీయాల్లోనూ ఆయన కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో నే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ మూవీ పింక్ రీమేక్ లో నటిస్తున్నారు. అదే “వకీల్ సాబ్” మూవీ. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నారు.
చాలా గ్యాప్ తరువాత పవన్ నటిస్తున్న సినిమా కావడంతో ఆయన అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఆయన సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు. అయితే, నిర్మాత దిల్ రాజు అభిమానుల ఆశలపై నీళ్లు జళ్లి.. షాక్ ఇచ్చినట్టు సమాచారం. ఎలా అనుకుంటున్నారా? ఆగండి అక్కడకే వస్తున్న..!
పవన్ వకీల్ సాబ్ మూవీని మొదట వచ్చే సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేస్తామని షూటింగ్ ప్రారంభంలోనే చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే, కరోనా వైరస్ కారణంగా షూటింగ్ నిలిచిపోయిన సంగతి తెలిసిందే. ఇటీవలే తిరిగి షూటింగ్ ప్రారంభం కావడంతో 90 శాతం చిత్రీకరణ పూర్తయింది. మిగతా బ్యాలెన్స్ పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పట్టేట్టు ఉంది. దీనికి తోడు పోస్ట్ ప్రొడక్షన్ మిగిలే ఉండటంతో సంక్రాంతి బరిలో ఈ సినిమాను దించే ఆలోచనను విరమించు కున్నారట దిల్ రాజు. వకీల్ సాబ్ ఇలా ఉండగా.. పవన్ చేతిలో ఉన్న క్రిష్, హరీశ్ శంకర్, సాగర్, సురేందర్ రెడ్డి ల సినిమాలు ఎప్పుడొస్తాయనేది సమాధానం లేని ప్రశ్నలు. వకీల్ సాబ్ వచ్చే సమ్మర్ లో విడుదల చేయనున్నట్టు సమాచారం.