కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ కంటే తెలంగాణ ప్రభుత్వం సమర్థంగా వ్యవహరించిందన్న అభిప్రాయం ఇక్కడ వ్యక్తమవుతుంటే తెలంగాణలో మాత్రం ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ బెటర్ అన్న సర్ట్ఫికెట్ లభించింది.
బిజెపి తెలంగాణ శాఖ అధ్యక్షుడు ధర్మపురి అరవింద్ కరోనా విషయంలో తెలంగాణ ప్రభుత్వ ప్రభుత్వాన్ని కడిగి పారేశారు.కరోనా విషయంలో కెసిఆర్ ప్రభుత్వ తీరు ఏ మాత్రం బాగోలేదని ఆయన ధ్వజమెత్తారు.తెలంగాణలో అతి తక్కువ కరోనా పరీక్షలు చేసి ఆ వ్యాధి తీవ్రతను తొక్కి పెడుతున్నారన్నారు.ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు నాలుగు లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహిస్తే తెలంగాణలో కేవలం ముప్పై వేల మందికి నిర్వహించారని ఆయన చెప్పారు.కరోనా కట్టడి కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులను కూడా కెసిఆర్ ప్రభుత్వం దారి మళ్లించిందని ఆయన ఆరోపించారు.పరిస్థితి ఇలాగే కొనసాగితే తెలంగాణ రాష్ట్రం కరోనా తో అతలాకుతలం కాగలదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.కేసీఆర్ పాలనలో అవినీతి అవధులు దాటిందని సిఎం రిలీఫ్ ఫండ్ విషయంలో కూడా అవినీతి జరుగుతోందని అరవింద్ ఆరోపించారు.రకరకాల నిబంధనల పేరుతో రైతు బంధు పథకంలో కూడా కోతలు విధించారన్నారు.ఇలాంటి చర్యల వల్లే ఇటీవల నిర్వహించిన సర్వేలో కేసీఆర్కు పదహారవ స్థానం లభించిందని ఎంపీ కూడా అయిన ధర్మపురి అరవింద్ ఎద్దేవా చేశారు.ఏదేమైనప్పటికీ ముఖ్యమంత్రుల్లో జూనియర్ అయిన జగన్ తో పోలిస్తే ఆరేళ్ల సీనియర్ అయిన కెసిఆర్ వెనుకబడడ౦ విశేషం .