Bahubali: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ దిశ దశ మార్చేసిన సినిమా బాహుబలి. ఈ సినిమా రాకముందు వరకు అంతర్జాతీయ సినిమా ప్రేమికులు ఇండియా గురించి కేవలం బాలీవుడ్ ఇండస్ట్రీ గురించి మాత్రమే మాట్లాడుకునే వారు. కానీ ఎప్పుడైతే బాహుబలి రిలీజ్ అయిందో.. ప్రపంచ సినిమా రంగం మొత్తం.. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే డైరెక్టర్ రాజమౌళి గురించి మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంతటి బ్లాక్బస్టర్ సినిమా స్టోరీ అందించింది రైటర్ విజయేంద్రప్రసాద్.
ఈ సినిమా మాత్రమే కాక ఇండియా లో భారీ బ్లాక్ బస్టర్ అయినా చాలా సినిమాలకు విజయేంద్రప్రసాద్ స్టోరీ అందించడం జరిగింది. అటువంటిది బాహుబలి సినిమాలో ప్రభాస్.. ఒకచోట ప్రమాణ స్వీకారం చేసే సీన్ ఉంటుందన్న సంగతి తెలిసిందే. మాహిష్మతి రాజ్యానికి రాజుగా.. రానా ప్రమాణస్వీకారం చేయగా… అదే సమయంలో సైన్యాధిపతిగా ప్రభాస్ చేసే ప్రమాణస్వీకారం సినిమాకి హైలెట్ గా ఉంటుంది.
Read more: Bahubali : రీల్ కాదు.. రియల్ బాహుబలి వీడియో అదుర్స్ ..!!
భూమి అదిరి పోవటం సైనికులు రాజ్యంలో ఉన్న ప్రజలు లు.. ప్రభాస్ ప్రమాణస్వీకారం చేస్తున్న టైంలో గట్టి గట్టిగా అరుపులు అరవడం.. సినిమా మొత్తానికి హైలెట్ గా ఉంటుంది. అయితే ఈ సీన్ తాను రాసే ముందు దానికి గల ప్రేరణ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అని తాజాగా ఇటీవల విజయేంద్రప్రసాద్ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ కెరీర్ ప్రయాణంగా పరిశీలించాక ఆ సన్నివేశం రాయటం జరిగిందని ఆయన దృష్టిలో పెట్టుకుని.. ప్రభాస్ బాహుబలి గా సైన్యాధిపతిగా ప్రమాణ స్వీకారం.. శీను సినిమా లో పెట్టడం జరిగిందని తెలిపారు.