Bala Krishna: బాలయ్య బాబు అఖండ సినిమా తర్వాత చేయబోయే సినిమా మీద అందరికీ ఆసక్తికరంగా మారింది. గోపీచంద్ మలినేని, బాలకృష్ణ కాంబినేషన్ లో మైత్రి మూవీస్ సినిమా తెరకెక్కనుంది. దీంట్లో నటీనటుల ఎంపిక కూడా పూర్తయింది. సినిమా మాత్రం ప్రారంభం జరిగిపోయింది షూట్ మాత్రం ఇంకా కావాల్సి ఉంది.
బాలయ్య బాబు చాలా త్వరగా ఈ సినిమాని పూర్తి చేస్తారని షూట్ బిగిన్ అయిపోతుందని వార్తలు బాగానే వినిపించాయి కానీ లేటెస్ట్ గా మనకు అందిన వార్త ఏంటంటే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళడానికి బాగానే సమయం పడుతుందట.
బాలయ్య బాబు ది unstoppable షో ఇప్పుడు పూర్తయిపోయింది. తాజాగా మనకు అందిన సమాచారం ఏంటంటే ఇంకా ఆయన పెండింగ్ పనులు చాలా ఉన్నాయి అని. ఇంకా బాలయ్య బాబు కథలు కూడా వినాల్సి ఉందని తెలుస్తుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాతే గోపీచంద్ మలినేని సినిమా స్టార్ట్ అవుతుందని బోగట్టా. వరలక్ష్మీ శరత్ కుమార్ ఇందులో కీలక పాత్ర పోషిస్తుంది. ఆమెకు కరోనా వచ్చి ఈమధ్యే తగ్గింది.
ఇక అఖండ బ్లాక్ బస్టర్ తర్వాత బాలయ్య కూడా కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. సక్సెస్ రేటు ఎక్కువ ఉన్న డైరెక్టర్లను ఆయన ఎంచుకుంటున్న ట్లు సమాచారం. అదీ కాకుండా తన ఇమేజ్ కు తగ్గట్టు తన అభిమానుల రుచికి సరిపడా కంటెంట్ కోసం అయినా చూస్తున్నారట. మరి బాలయ్య వద్దకు అలాంటి కథతో ఎవరు వస్తారు… ఇంకొక హిట్ ఏ దర్శకుడు ఇస్తాడు అన్న విషయం పై నందమూరి అభిమానులంతా ఆసక్తిగా ఉన్నారు.