Bala Krishna : టాలీవుడ్ ఇండస్ట్రీలో మాస్ ఫాలోయింగ్ ఉన్న హీరో లలో ఒకరు నందమూరి బాలయ్య బాబు. టాప్ హీరోలు ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నాగాని బాలయ్య బాబుకి ఉండే అభిమానుల తీరు వేరు. అదే రీతిలో బాలయ్య కూడా అభిమానులతో చాలా చనువుగా ఉంటారు అన్న సంగతి తెలిసిందే. ఒకపక్క క్రమశిక్షణగా ఉంటూనే మరో పక్క అభిమానుల విషయంలో చాలా జాగ్రత్తగా బాలయ్య బాబు వ్యవహరిస్తూ ఉంటారు. ఇటువంటి తరుణంలో తాజాగా నెల్లూరు జిల్లా కావలి పట్టణానికి చెందిన ఓ వీరాభిమాని మనోహర్ అనే వ్యక్తి అనారోగ్యంతో బాధపడుతూ ఉన్న తరుణంలో..
ఇదే తరుణంలో కోటం రెడ్డి శ్రీనివాసులు అతన్ని పరామర్శించడానికి వెళ్లటం జరిగింది. బాలయ్య వీరాభిమాని కావడంతో ఈ విషయాన్ని బాలయ్యకు ఫోన్ ద్వారా తెలియజేశారు. వెంటనే బాలయ్య బాబు ఫోన్ తన అభిమాని మనోహర్ కి ఇవ్వమని.. చెప్పి అతనికి ధైర్యం చెప్పటం జరిగింది. అండగా ఉంటామని మామూలు మనిషి అయి తిరిగి బయట ప్రపంచంలో వస్తావని మనోహర్ కి ధైర్యాన్ని నూరిపోశారు. అంతేకాకుండా మన వాళ్లు అండగా ఉంటారని…మీరంతా నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్లు అంటూ.. బాలకృష్ణ మనోహర్ తో ఫోన్లో చెప్పటంతో ఆ అభిమాని ఒక్కసారిగా కంటతడి పెట్టాడు. ఇదే తరుణంలో మనోహర్ కుటుంబ సభ్యులకు కూడా బాలకృష్ణ అండగా ఉంటానని స్పష్టం చేశారు. దీంతో ఫోన్ లో బాలయ్య మాటలు విన్న చుట్టుపక్కల అభిమానులు కూడా.. తమ తోటి అభిమాని మనోహర్ కి ధైర్యం చెప్పడం జరిగింది. వీర అభిమాని కావటంతో బాలయ్య మాట్లాడుతున్నంత సేపు మనోహర్ కంటతడి పెడుతూనే ఉన్నాడు. ఫోన్ పెట్టేసిన తర్వాత మిగతా అభిమానులతో ..జీవితానికి ఇది చాలు అంటూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.