Uppena : టాలీవుడ్ మోస్ట్ సీనియర్ అగ్ర నటులలో ఒకరైన నందమూరి బాలకృష్ణ ఈ వయసులో కూడా ఎంతో యాక్టివ్ గా తను కథానాయకుడిగా మాస్ సినిమాలు చేయడం చూస్తూనే ఉన్నాం. అయితే ఒకానొక సందర్భంలో బాలకృష్ణ “నేను… నా సినిమాలు, నాన్నగారి సినిమాలు తప్పించి ఇంకేమీ చూడను” అని చెప్పడం విన్నాం. అయితే ఆ మాటలు విని జనాలు కూడా మిగతా సినిమాలు చూడకపోతే ట్రెండ్ కు తగ్గట్లు అప్డేట్ కావడం ఎలా? కథల విషయంలో జడ్జ్మెంట్ లో కూడా తేడా వస్తుంది అని అనుకున్నారు.
మరీ గిరిగీసుకుని బాలకృష్ణ ఇలాగే కూర్చుంటారా….? అంటే అనుమానమే. అయితే ఏమైందో ఏమో కానీ లేటెస్ట్ టాలీవుడ్ సినిమా సెన్సేషన్ ‘ఉప్పెన’ సినిమా ను బాలకృష్ణ చూడడం జరిగింది. ఈ విషయాన్ని బహిరంగపరచడం కూడా అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. ‘నటసింహం’ బాలకృష్ణ కోసం మైత్రి మూవీ మేకర్స్ వారు ప్రత్యేక స్క్రీనింగ్ వేశారు. దర్శకుడు బుచ్చి తో కలిసి తన కుటుంబ సమేతంగా బాలకృష్ణ సినిమా చూశారు.
బయటకు వచ్చిన తర్వాత కూడా బుచ్చి బాబు తో కలిసి ఫోటోలకు ఫోజులు ఇచ్చాడు. మైత్రీ వాళ్ళే ట్విట్టర్ ఈ విషయం అధికారికంగా ప్రకటించేశారు. బాలయ్య ఈ సినిమా చూసి కాస్ట్ అండ్ క్రూ ని విపరీతంగా అభినందించినట్లు వెల్లడించారు కూడా. అసలు బాలకృష్ణకు అదేపనిగా ఈ సినిమా స్క్రీనింగ్ ఎందుకు వేసినట్లు? అడగగానే ఆయన ఎలా ఒప్పుకున్నాడు? అన్న చర్చ ఇప్పుడు నడుస్తోంది.
పైగా ఈ సినిమా మెగా హీరో ఆరంగేట్రం చిత్రం కావడం కూడా జనాలకు ఆశ్చర్యం కలిగిస్తోంది. ఇక ఈ సినిమా చూసిన బాలకృష్ణ చాలా అద్భుతంగా ఉందని చాలా రోజుల తర్వాత మంచి సినిమా చూసినట్లు బయటకు వచ్చి కితాబులు ఇచ్చారట. అంతేకాకుండా ఈ సినిమాకు కుటుంబం మొత్తాన్ని తీసుకు రావడం… వచ్చి దర్శకుడితో పాటు అందరినీ అభినందించడం కూడా విశేషమే
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!