టాలీవుడ్ ఎంతో మందికి మంచి ప్లాట్ ఫామ్ గా మారింది. కొత్త కొత్త వ్యక్తులను పరిచయం చేస్తూ వారి టాలెంట్ ను బయట పెట్టేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా తాజాగా మరో కొత్త సినీ నిర్మాణ సంస్థ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. ఈ మూవీలో అందరూ నూతన వ్యక్తులే కావడం విశేషం. అంటే ఇందులో నటించే నటీ నటుల నుంచి దర్శకులు కూడా అందరూ కొత్త వారే ఉన్నారు. అయితే ఈ మూవీలో హర్ష కనుమిల్లి హీరోగా నటించబోతున్నారు.
జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడిగా, నిర్మాతగా జిష్ణురెడ్ది సిని రంగంలోకి ప్రవేశించనున్నారు. అయితే ఈ సెహరి మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను నందమూరి బాల కృష్ణ విడుదల చేశారు. ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ.. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి మేనల్లుడు ఈ సినిమాకు నిర్మాతగా ఉండటం చాలా సంతోషం. అయితే నిర్మాత నాకు ఫ్యామిలీ ఫ్రెండ్ కూడా.
అలాగే హీరో హర్ష పుట్టిన రోజున ఇలాంటి కార్యక్రమం జరగడం సంతోసంగా ఉందని బాలయ్య తెలిపారు. అలాగే హీరో, నిర్మాతలు కథను ఎంతో ఉత్సాంగా నాకు వివరించారని బాలయ్య పేర్కొన్నారు. అలాగే నాకు ఎక్కువగా ఎవరూ సినిమాలను చూపించరు. ఎందుకంటే నాకు సినిమా నచ్చకుంటే నేను మధ్యలోనే వచ్చేస్తా.. అది నా షాడిజం. మరోటైతే కాదు. సినిమా నచ్చకపోతే వారికి నేను సలహాలూ, సూచనలిస్తాను. అవి పాటించడం పాటించకపోవడం వాళ్లిష్టం అని తన అభిప్రాయాలను బయటపెట్టారు బాలయ్య.
అలాగే వర్గో బ్యానర్ కు సెహారీ మూవీ మంచి పేరు ప్రతిష్టలు తెచ్చిపెట్టానలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని బాలయ్య చెప్పుకొచ్చారు. అలాగే ఇలా సినిమా ఫంక్షన్లకు వచ్చి కొబ్బరి కాయ కొట్టి సినిమా ఫ్లాప్ కావాలని కోరుకునే వారు ఇండస్ట్రీలో చాలా మందే ఉన్నారని బాలయ్య అన్నారు. ముఖ్యంగా నేను సినిమా ఫంక్షన్లకు చాలా తక్కువగా వస్తాను. సో మీకు ఈ సినిమా మంచి సక్సెస్ ను తేవాలని కోరుకుంటానని బాలయ్య తన భావాలను తెలిపారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!