Balakrishna: బాలయ్య బాబు ఆలోచనలు మారుతున్నట్లు తాజా పరిస్థితుల బట్టి అర్థం అవుతున్నాయి. కరోనా నేపథ్యంలో సినిమా థియేటర్లు క్లోజ్ అయ్యే పరిస్థితి ఉండటంతో సినిమా షూటింగులు కూడా ఆలస్యం అవుతూ ఉండటంతో బాలయ్యబాబు బుల్లితెరపై దృష్టి పెట్టినట్లు తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది. ఈ క్రమంలో లో అల్లు అరవింద్ ఆహా ఓటీటీ లో.. “ఆన్ స్టాపబుల్” అనే టాకీ షో కి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇవ్వటం తెలిసిందే. నిన్ననే అధికారికంగా ఆహా టీం.. ఈ టాకీస్ షో కి సంబంధించి.. పెద్ద ఫంక్షన్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా బాలయ్య బాబు మంచి ఎనర్జిటిక్ గా.. మాట్లాడుతూ అల్లు అరవింద్ నీ.. పొగడ్తలతో ముంచెత్తారు.
ఇదిలా ఉంటే బుల్లితెరపై తిరుగులేని టిఆర్పి రేటింగ్ గత కొన్ని సంవత్సరాల నుండి సాధిస్తున్న జబర్దస్త్ కామెడీ షో కి… బాలయ్య బాబు వస్తున్నట్లు లేటెస్ట్ టాక్ నడుస్తోంది. విషయంలోకి వెళితే ఇటీవల రోజా బాలయ్య బాబు తో ఫోన్లో మాట్లాడారు. ఆ ఫోన్ ఆడియో ట్రాక్ సోషల్ మీడియాలో కూడా వచ్చింది. ఈ సందర్భంగా రోజా బాలయ్య బాబు యోగక్షేమాలు అడగటం.. మాత్రమే కాక మళ్లీ మీతో సినిమా చేయాలని ఉంది. బయట చాలా మంది భైరవద్వీపం పార్ట్ 2, లేదా బొబ్బిలి సింహం పార్ట్ 2… ఎప్పుడు చేస్తారు అని అడుగుతున్నట్లు బాలయ్య బాబుతో రోజా ముచ్చటించారు.
బాలయ్య ఫోన్ కాల్
ఈ క్రమంలో బాలయ్య బాబు నవ్వుతూ మన కాంబినేషన్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు అవసరమైతే జబర్దస్త్ కి జడ్జిగా కూడా తాను వస్తానంటూ బాలయ్య ఈ ఫోన్ కాల్ లో చెప్పటం.. ఇప్పుడు సంచలనంగా మారింది. ఇదే సమయంలో రాఘవ, అభి అందరు నాకంటే పెద్ద వాళ్ళని సరదాగా బాలయ్య బాబు మాట్లాడటం.. చాలా జోకులు వేయడం తో బాలకృష్ణ.. ఫోకస్ చాలా వరకు బుల్లితెరపై ఉన్నట్లు అభిమానులతో పాటు సామాన్య ప్రేక్షకులు భావిస్తున్నారు.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?