అమరావతి: 26సంవత్సరాల యువకుడు కిరణ్ కుమార్ శర్మ (బాలస్వామి) విశాఖ శారదాపీఠం అధిపతిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం పీఠాధిపతిగా స్వరూపానందేంద్ర స్వామి వ్యవహరిస్తున్నారు. త్వరలో ఆయన పదవి ముగినయనుండటంతో స్వామి ప్రధమి శిష్యుడైన బాలస్వామిని ఉత్తరాధికారిగా నియమించాలని స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి నిర్ణయించారు.
ఈ నెల 15,16,17 తేదీల్లో విజయవాడ కృష్ణా కరకట్టపై ఉత్తరాధికారి శిష్యతురీయాశ్రమ దీక్షా స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే ఈ కార్యక్రమానికి సంబంధించిన ఆహ్వనపత్రికలను తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్మోహనరెడ్డి, కె చంద్రశేఖరరావు, గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్, ఇతర ప్రజాప్రతినిధులకు పంపారు. ఈ కార్యక్రమానికి ఈ ఇద్దరు ముఖ్యమంత్రులతో పాటు ఇతర రంగాల ప్రముఖులు, ప్రజాప్రతినిధులు హజరుకానున్నట్లు సమాచారం.
విశాఖ జిల్లా భీమునిపట్నంకు చెందిన పోణంగి హనుమంతరావు, ప్రభావతమ్మల కుమారుడైన బాలస్వామి మూడవ తరగతి వయస్సులోనే పీఠానికి చేరుకుని శిష్యరికం స్వీకరించారు.