ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ స్నేహితుల ప్రొడక్షన్ మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ అదేవిధంగా కొణిదెల ప్రొడక్షన్స్ కలసి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా పై అంచనాలు ఓ రేంజ్ లో ఉన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కూడా ఈ సినిమాలో దాదాపు అరగంట పాత్ర చేయనున్నారు.
హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ నటిస్తున్న “ఆచార్య” సినిమాకి మణిశర్మ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ దాదాపు సగానికిపైగా అయిపోవటంతో వచ్చే ఏడాది వేసవి సమయంలో రిలీజ్ చేసే ఆలోచనలో సినిమా యూనిట్ వుంది. మరోపక్క నటసింహం నందమూరి బాలయ్య బాబు హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా కూడా వచ్చే వేసవి ఈ సమయంలోనే రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారట.
ఈ సినిమాకి సంబంధించి కూడా ఇటీవల మహమ్మారి కరోనా ఎఫెక్ట్ తర్వాత షూటింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. మంచి యాక్షన్ ఎంటర్ టైనర్ గా మాత్రమే కాక కమర్షియల్ తరహాలో కూడా ఈ సినిమా తెరకెక్కుతున్నట్లు ఫిలిం నగర్ టాక్. ఇదిలా ఉండగా మేటర్ లోకి వెళ్తే మెగాస్టార్ ప్రస్తుతం చేస్తున్న “ఆచార్య” అదేవిధంగా బాలయ్య బాబు బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఈ రెండూ కూడా ఒకే రోజు వేసవికాలంలో రిలీజ్ అవుతున్నట్లు సరికొత్త టాక్ ఇండస్ట్రీలో వస్తుంది. గతంలో ఈ ఇద్దరు హీరోల సినిమాలు కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఒకే రోజు రిలీజ్ అయ్యి పోటాపోటీ పడ్డాయి. అయితే చాలా కాలం తర్వాత మళ్లీ వీరిద్దరి సినిమాలు ఒకే రోజు రిలీజ్ అవుతున్నట్లు వార్తలు రావడంతో మెగా వర్సెస్ నందమూరి అభిమానులు అన్నట్టు సీన్ మారనున్నట్లు తెలుస్తోంది.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?