ఎన్టీఆర్ 25 వ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలయ్య బాబు తో పాటు పార్టీకి చెందిన నాయకులు కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ బాలకృష్ణ తన తండ్రి స్వర్గీయ ఎన్టీ రామారావు గురించి మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. భూమి మీద చాలా మంది పడతారు కానీ కొంత మంది మహానుభావులు అవుతారని తెలిపారు.
ఎన్టీఆర్ గురించి మాట్లాడటం అంటే ఆకాశంలో ఉన్న సూర్యుడినే వేలెత్తి చూపడం లాంటిది అంటూ చెప్పుకొచ్చారు. తాను నిరాశలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పిలిస్తే ఒక్కసారిగా ఉత్సాహం వచ్చేదని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే బాలయ్య మాట్లాడుతున్న సమయంలో చాలా మంది మీడియా ప్రతినిధులు అత్యుత్సాహం చూపించటంతో వాళ్ళ పై అసహనం వ్యక్తం చేస్తూ భారీ డైలాగులు వేశారు.
అత్యుత్సాహం చూపుతూ మైకులు మీద మీద పడుతున్న సమయంలో.. మీడియా ప్రతినిధులు గుంపుల్లో ఒకరు ‘మైక్ పెట్టు.. మైక్ పెట్టు తమ్ముడూ’ లాంటి మాటలు విని.. ‘ఎక్కడా ? మైక్ పెట్టు కాదు.. మైక్ పట్టుకో అను.. నీ యబ్బా’ అంటూ బాలయ్య సీరియస్ వ్యాఖ్యలు చేశారు. ఇక అప్పటికే బాలయ్య మాట్లాడుతూ.. ‘కొంచెం ముందుకు రండి.. వెనక్కి వెళ్లండి సార్’ అని మీడియా సిబ్బంది అనడంతో.. ‘చాల్ చాల్లే.. మీ సలహాలు.. సూది బెజ్జం అంత సందు ఇస్తే చెవిలో ఉచ్చపోసే రకాలు మీరు’ అంటూ ప్రతినిధులను ఉద్దేశించి బాలయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. దీంతో ఎన్టీఆర్ గురించి ఇచ్చిన స్పీచ్ కంటే బాలయ్య మీడియా పై వేసిన డైలాగులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.