ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ సినిమాను జనవరి 14న రిలీజ్ చేయాలనుకుంటున్నారట నిర్మాత దిల్ రాజు. కొన్ని కీలక సన్నివేశాలు మాత్రమే మిగిలి ఉండటంతో పవన్ కళ్యాణ్ ఈ సినిమాని కంప్లీట్ చేసేందుకు డేట్స్ ఇచ్చారని అంటున్నారు. పవన్ మీద చిత్రీకరించాల్సిన బ్యాలెన్స్ టాకీ పార్ట్ కంప్లీట్ అయితే మిగిలిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్ ని కంప్లీట్ చేసి సంక్రాతికి రెడీ చేయనున్నారట. ఇక ఇప్పటికే ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషిస్తున్న నివేదా థామస్ తన పాత్రకి సంబంధించిన షూటింగ్ కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోయిందని తెలుస్తుంది.
ఇక గతంలో బాలయ్యకు ‘సింహ’, ‘లెజెండ్’ లాంటి రెండు భారీ కమర్షియల్ హిట్స్ ఇచ్చిన బోయపాటి ఈ సారి అంతకు మించి భారీ సక్సస్ ఇవ్వాలని.. హ్యాట్రిక్ హిట్ దక్కించుకోవాలని ఎంతో కసిగా బిబి3 ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాని ద్వారక క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్రెడ్డి నిర్మిస్తుండగా ఎస్.ఎస్ తమన్ సంగీతం అందిస్తున్నారు.
వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో పూర్తవ్వాల్సింది. కాని కరోనా వచ్చి అడ్డుపడింది. అయితే మళ్ళీ ఈ సినిమాని ప్రారంభించేందుకు బాలయ్య బోయపాటి రెడీ అవుతున్నారట. త్వరలో షూటింగ్ మొదలు పెట్టి సింగిల్ షెడ్యూల్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలని ఫిక్సైయ్యారట. అంతేకదు ఒకవైపు టాకీపార్ట్.. డబ్బింగ్, ఎడిటింగ్ వంటి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలని కంప్లీట్ చేసి ఎట్టి పరిస్థితుల్లో 2021 సంక్రాంతి సందర్భంగా జనవరి 15న భారీ స్థాయిలో విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.
మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో రూపొందుతున్న ఆచార్య సినిమా కూడా సంక్రాంతికి రిలీజ్ చేస్తామని మేజర్స్ అధికారకంగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసినప్పుడే వెల్లడించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. రాం చరణ్ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మణిశర్మ సంగితమందిస్తున్నాడు.
అయితే ఈ సీనియర్ హీరోలకి ఇప్పుడు సంక్రాంతి బరిలో పోటీగా యంగ్ హీరో నితిన్ వచ్చి చేరాడు. నితిన్, కీర్తి సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమా రూపొందుతుంది. కరోనా కారణంగా ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ తిరిగి రీసెంట్ గా మొదలు పెట్టారు. అంతేకాదు ఎటువంటి పరిస్థితుల్లో సంక్రాంతి బరిలో ఈ సినిమాని దింపబోతున్నట్టు మేకర్స్ క్లారిటీ ఇచ్చారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!