ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ బోయపాటి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా బాలయ్య, బోయపాటి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా. ద్వారక క్రియోషన్స్ బ్యానర్ లో మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తుండగా థమన్ సంగీతమందిస్తున్నాడు. లాక్ డౌన్ కారణంగా నిలిచిపోయిన ఈ సినిమా షూటింగ్ ను మళ్లీ డిసెంబర్ నుంచి ప్రారంభించి 2021 సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం.
ఇక ఈ సినిమా తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య ఒక సినిమా చేస్తాడని తాజా సమాచారం. ఈ సినిమా 2021 జనవరి లో చిత్రీకరణ ప్రారంభమై విజయదశమి కి రిలీజ్ చేసేలా దర్శకుడు అనీల్ రావిపూడి ప్లాన్ చేస్తున్నాడట. ఈ సంవత్సరం ప్రారంభంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరు సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు అనీల్ రావిపూడి.
పటాస్ సినిమా నుండి సరిలేరు వరకు వరుసగా సూపర్ హిట్స్ అందుకుంటున్న అనీల్ రావిపూడి స్పీడుకి కరోనా బ్రేక్ వేసింది. దాంతో ఎఫ్ 3 మొదలు పెట్టాలనుకున్న అనిల్ రావిపూడి ప్లాన్స్ అన్ని తారుమారయ్యాయి. ఈ నేపథ్యంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ బాలయ్యతో ఫిక్స్ అయ్యాడని అంటున్నారు. అయితే ఇంతకు ముందే ఈ కాంబినేషన్ లో సినిమా అనుకొని గ్యాప్ వచ్చింది. మరి ఈ సారైనా ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా లేదా చూడాలి.
ఇక బాలయ్య తో ఒక సినిమా తీయాలని పూరి కూడా సన్నాహాలు చేస్తున్నాడు. లాక్ డౌన్ లో బాలయ్య కోసం కథ రాసి వినిపించినట్టుగాను వార్తలు వచ్చాయి. మరి బోయపాటి సినిమా తర్వాత బాలయ్య పూరి తో సినిమా చేస్తాడా లేదా అనీల్ రావిపూడితో సినిమా చేస్తాడా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ గా మారింది. ఈ కారణంగానే అనీల్ రావిపూడి బాలయ్య కాంబినేషన్ లో సినిమా అని వస్తున్న వార్త అఫీషియలా అంటూ బాలయ్య ఫ్యాన్స్ డైలమాలో ఉన్నారట.