టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలయ్య బాబు ఇటీవల హైదరాబాదులోని బసవతారకం హాస్పిటల్ లో ఆల్ క్లిన్ వాటర్ సదుపాయాన్ని న్యూట్రో పానిక్ వార్డ్ ప్రారంభించారు. ఈ సందర్భం గా క్యాన్సర్ హాస్పిటల్ సేవలను.. వైద్యుల పనితీరును ప్రశంసించారు. దేశంలోనే అత్యుత్తమ వైద్యాన్ని పేదలకు అందించే హాస్పిటల్ గా బసవతారకం హాస్పిటల్ సేవలను కొనియాడుతూ మరోపక్క ఏపీ రాజకీయాల గురించి మాట్లాడారు.
ముఖ్యంగా తన నియోజకవర్గం హిందూపురంలో అధికార పార్టీ వివక్షత చూపిస్తున్నట్లు స్పష్టం చేశారు. నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు అధికార పార్టీ పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఫీజు రియంబర్స్మెంట్ తోపాటు చాలా పెండింగ్లో ఉన్నాయని బాలయ్య ఆరోపించారు. రైతులకు పంట నష్టం విషయంలో గిట్టుబాటు ధరల విషయంలో అస్సలు హిందూపురం నియోజకవర్గ ప్రజలను జగన్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బాలయ్య పేర్కొన్నారు.
అయితే ఈ విషయంలో నియోజకవర్గంలో ఉన్న టీడీపీ క్యాడర్ మరియు కీలక నాయకులు ధర్నా చేస్తూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తున్నారు అంటూ.. మరో పక్క ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో తాను కూడా మాట్లాడుతున్నట్లు బాలయ్య చెప్పుకొచ్చారు. ఏది ఏమైనా హిందూపురం నియోజకవర్గం పై జగన్ పార్టీ చాలా చిన్నచూపు చూస్తున్నట్లు బాలయ్య బాబు తెలిపారు.