టాలీవుడ్ నిర్మాత కమెడియన్ బండ్ల గణేష్ కి ఇటీవల కరోనా పాజిటివ్ వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కోసం ఇటీవల డాక్టర్ ని గణేష్ సంప్రదించగా.. ముందుగా డాక్టర్ కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకోవాలని సూచించడం జరిగింది. ఈ నేపథ్యంలో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోగా రిపోర్ట్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది. షాద్ నగర్ ప్రాంతంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉండటంతో అదే ప్రాంతంలో బండ్ల గణేష్ వ్యాపారాలు ఉన్న నేపథ్యంలో ఆయనకి కరోనా సోకినట్లు వైద్యులు అధికారులు నిర్ధారించుకున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీ అంతా ఒక్కసారిగా షాక్ అయిపోయింది. దీంతో ఎవరైతే ఆయనను కలిశారో వాళ్లు కూడా టెన్షన్ పడటం జరిగింది.
కరోనా బారిన పడటంతో వెంటనే అపోలో హాస్పిటల్ లో ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. కనీసం వారం రోజులు పైగానే హాస్పిటల్లో బండ్లగణేష్ ఉండటంతో ఇటీవల మరోసారి టెస్ట్ చేయించుకోవడం తో… నెగిటివ్ రిపోర్టు రావడం జరిగింది. దీంతో బండ్ల గణేష్ సోషల్ మీడియాలో తాను కరోనా నుంచి కోలుకున్నట్లు పోస్ట్ పెట్టారు. అంతేకాకుండా ఫుల్ హ్యాపీ తో థాంక్ గాడ్ అంటూ తన రిపోర్ట్స్ ను పోస్ట్ చేసారు. తన కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో బండ్లగణేష్ కరోనా రిపోర్ట్స్ చూసిన అభిమానులు, కరోనా నుండి కోలుకోవడంతో అన్న సేఫ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.