టాలీవుడ్ లో కొద్దిరోజులపాటు అగ్ర నిర్మాత గా వెలుగొందిన బండ్ల గణేష్ రాజకీయ ప్రస్థానం అతి కొద్ది కాలానికి ముగిసిపోయింది. తెలంగాణ కాంగ్రెస్ నాయకుడిగా ఉన్న బండ్లగణేష్ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర పరాభవం తర్వాత ఇక ఆ వైపు కన్నెత్తి చూస్తే ఒట్టు. బహిరంగంగానే అతని నిర్ణయం పట్ల చింతించడం కూడా జరిగింది. ఇక మనకు ఏది సూట్ అవుతుందో.. అది చేయాలి. మన బలబలాలు గ్రహించాలి.
అత్యాశకు పోయి ఏదైనా పని చేస్తే చివరికి దెబ్బైపోతారు. దక్షిణాదిన ఎంతోమంది సినీ హీరోలు రాజకీయ నాయకుల్లా ఎదిగేందుకు ప్రయత్నించారు కానీ వారిలో తమిళనాడున ఎంజీఆర్, జయలలిత తెలుగునాట ఎన్టీఆర్ మాత్రమే సక్సెస్ అయ్యారు. కన్నడ మలయాళంలో కూడా సినీ తారలు ఉనికి ఉంది. అయితే ఎన్టీఆర్ తర్వాత యెలుగు రాజకీయాల్లో సక్సెస్ అయిన వారు లేరు. ఇక పవన్ కూడా కష్టం మీద ఎదురీదుతున్నాడు.
అలాంటిది బండ్ల గణేష్ లాంటి ఒక సాధారణ నిర్మాత తెలంగాణ కాంగ్రెస్ లో చేరి ఎన్నికల వేళ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. కానీ కాంగ్రెస్ కథ ముగిసిన తర్వాత గుడ్ బై చెప్పి హ్యాపీగా సినిమాల బాట పట్టిన అతడికి ట్విట్టర్ లో ఒకతను ఒక అరుదైన ప్రశ్న వేశాడు. నువ్వు మళ్లీ బీజేపీలో చేరుతున్నావా అని అడిగాడు.
ప్రస్తుతం బిజెపి.. జనసేనతో పొత్తులో ఉంది. బండ్ల గణేష్ ఆ ప్రశ్న కి దణ్ణం సింబల్ పెట్టి ‘నో పాలిటిక్స్ బ్రదర్’ అంటూ తేల్చేశాడు. ఇక నేను రాజకీయాల్లోకి రాను అన్నాడు కానీ పవన్ అభిమానులు ఎవరైనా కూడా గణేష్ కనీసం తన ట్విట్టర్లో జనసేనకు సపోర్ట్ చేస్తారు అని ఆశించారు. లేదా బిజెపి అంటే తనకు ఇష్టమని లేదా పాలిటిక్స్ లో వారికి సపోర్ట్ చేస్తా అని చెప్తాడు అనుకున్నారు కానీ మరీ ఇంత దండం పెట్టేలా కాంగ్రెస్ రాజకీయాలు అతనిపై ఎఫెక్ట్ చూపిస్తాయని మాత్రం ఎవరూ అనుకోలేదు.