Bandla Ganesh: అక్టోబర్ పదో తారీఖున మా అధ్యక్ష ఎన్నికలు నిర్వహించడానికి మా క్రమశిక్షణ కమిటీ సిద్ధమవుతోంది. దీంతో టాలీవుడ్ ఇండస్ట్రీలో “మా” ఎన్నికల సెగ రాజకీయ వాతావరణాన్ని తలపిస్తుంది. ఇప్పటికే ప్రకాష్ రాజు ప్యానల్.. వర్సెస్ ఇతర ప్యానల్ సభ్యులు అన్న తరహాలో వాతావరణం ఉంది. ప్రకాష్ రాజ్ కి మెగా కాంపౌండ్ సపోర్ట్ ఫుల్ గా ఉంది. పరిస్థితి ఇలా ఉండగా సాయి ధరమ్ తేజ్ బైక్ యాక్సిడెంట్.. జరగటం పై మా అధ్యక్షుడు నరేష్.. సాయి ధరంతేజ్ ఘటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి.
ఇటువంటి సమయంలో ఈ విధంగా వ్యవహరించడం అవసరం అంటూ నరేష్ పై చాలామంది మండిపడుతున్నారు. తాజాగా నరేష్ చేసిన కామెంట్లపై బండ్ల గణేష్ వీడియో రూపంలో మెసేజ్ ఇస్తూ సీరియస్ అయ్యారు. బండ్ల గణేష్ ఏమన్నారంటే…”జరిగింది చిన్నప్రమాదమే. ఇలాంటి సమయంలో నరేశ్ గారు గతంలో ప్రమాదాల్లో మరణించినవారి పేర్లు చెప్పడం సబబు కాదు. రేసింగ్ చేశాడు, అది చేశాడు ఇది చేశాడు అని చెప్పడం అవసరమా సార్! మా ఇంటి దగ్గరికి వచ్చాడు… అంటూ ఎందుకు ఇవన్నీ చెప్పడం… తప్పు కదూ! ఇలాంటి సమయాల్లో ఆ పరమేశ్వరుడ్ని ప్రార్థించాలి.
అంతేతప్ప అసందర్భ విషయాలు మాట్లాడకూడదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి. సాయితేజ్ చిన్న ప్రమాదం నుంచి భగవంతుడి ఆశీస్సులతో క్షేమంగా బయటపడ్డాడు” అని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. ఈ తరుణంలో మరికొంత మంది ఇటువంటి టైం లో నరేష్ ఈ విధంగా వ్యాఖ్యలు చేయటం అర్థరహితమని ఖండిస్తున్నారు. ఏది ఏమైనా మా అధ్యక్ష ఎన్నికలకు ముందు.. నరేష్ సాయి ధరంతేజ్ ఘటనకు సంబంధించి.. చేసిన వ్యాఖ్యలు టాలీవుడ్ ఇండస్ట్రీలో కాక రేపుతున్నాయి.