బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా భారత ప్రభుత్వం పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆసియాలో నిజమైన మిత్ర దేశం భారత్ అని అభివర్ణించారు. స్వాతంత్ర పోరాటంలో బంగ్లాదేశ్ కి అండగా నిలిచినందుకు ధన్యవాదాలు అని తెలిపారు. తూర్పు పాకిస్తాన్ నుండి విడిపోయి సొంతంగా దేశం ఏర్పాటు చేసుకునే క్రమంలో బంగ్లాదేశ్ కి ఆ సమయంలో భారత్ అండగా ఉందన్న సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో 1971లో ఇండో-పాక్ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధంలో ఇండియా విజయం సాధించడంతో బంగ్లాదేశ్ నూతన దేశంగా ప్రపంచంలో అవతరించింది. ఈ చారిత్రాత్మక ఘటన చోటు చేసుకుని బుధవారానికి 50 సంవత్సరాలు కంప్లీట్ కావడంతో బంగ్లాదేశ్ ప్రధాని భారత్ ప్రభుత్వం ఆ సమయంలో చేసిన పోరాటాన్ని గుర్తు చేసుకుంటూ తాజాగా ధన్యవాదాలు చెప్పుకొచ్చింది.
దీంతో బంగ్లాదేశ్ ప్రధాని చేసిన కామెంట్లు ఆసియా దేశాలలో సంచలన నెలకొల్పింది. చాలావరకు ఇండియాకి పొరుగున ఉన్న దేశాలు శత్రు దేశాలుగా మారుతున్న తరుణంలో బంగ్లాదేశ్.. భారత్ ని ఉద్దేశించి తన నిజమైన మిత్రుడు దేశమని అభివర్ణించడం అంతర్జాతీయ మీడియాలో సంచలన వార్తగా ప్రసారమవుతుంది. ఒక్క స్వతంత్ర పోరాటం వచ్చిన సమయంలో మాత్రమే కాక చాలా సందర్భాలలో బంగ్లాదేశ్ కి ఆపన్నహస్తం అందించింది భారత్. ఏది ఏమైనా బంగ్లాదేశ్ కి స్వాతంత్రం వచ్చి 50 సంవత్సరాలు కావచ్చిన నేపథ్యంలో వేడుకలు అంగరంగ వైభవంగా జరిగింది బంగ్లా ప్రభుత్వం.
Lok Sabha Elections 2024: ప్రధాని మోడీ వివాదాస్పద వ్యాఖ్యలు .. ఫిర్యాదులపై ఈసీ పరిశీలన..?