Bank New guidelines: ఇది ఉద్యోగులకు పెన్షన్ లకు ఓ విధంగా గుడ్ న్యూస్. ఏమిటంటే ఆగస్టు 1వ తేదీ నుండి సెలవు రోజుల్లోనూ పెన్షన్ డబ్బులు, జీతం వారి అకౌంట్ లో జమ కానున్నాయి. ఇప్పటి వరకూ సెలవు దినాల్లో పెన్షన్, జీతాలు, ఈవిఎంలు చెల్లింపులకు అవకాశం ఉండేది కాదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) నేషనల్ ఆటోమేటెడ్ క్లీయరింగ్ హాస్ నిబంధనల్లో మార్పులు తీసుకురావడం వల్ల సెలవు రోజుల్లోనూ జీతాలు, పెన్షన్లు అకౌంట్ లలో జమ కానున్నాయి. అంటే ఉద్యోగులకు పెన్షనర్ లకు శుభ వార్తే కదా.
మరో విషయం ఏమిటంటే..ప్రవేటు రంగానికి చెందిన దిగ్గజ బ్యాంకులలో ఒకటైన ఐసీఐసీఐ ఆగస్టు 1వ తేదీ నుండి కొత్త రూల్స్ అమలు చేస్తున్నది. చెక్ బుక్, ఏటీఎం క్యాష్ విత్ డ్రా వంటి రూల్స్ ను బ్యాంకు సవరించింది. ఈ క్రమంలోనే కస్టమర్లు పరిమితికి మించి డబ్బులు ఏటీఎం నుండి విత్ డ్రా చేయడం వల్ల వారిపై అదనపు చార్జీలు పడనున్నాయి. ఈ విషయాలను ఐసీఐసీఐ ఖాతాదారులు తెలుసుకోవాల్సి ఉంది. ఈ నిబంధనలు తెలుసుకోకుండా ఇప్పటి మదిరిగానే ఆగస్టు 1వ తేదీ తరువాత నగదు విత్ డ్రా చేసుకున్నట్లయితే వారికి తెలియకుండానే వారి ఖాతా నుండి అదనపు చార్జీలు కట్ అవుతాయి అన్నమాట.