20-20 ఐపిఎల్ లీగ్ క్రికెట్ మ్యాచ్ లు జరుగుతున్నాయి. ఈ మ్యాచ్ లు బెట్టింగ్ రాయుళ్ళకు పండగే.. బెట్టింగ్ లకు యువత ఎక్కువగా ఆకర్షితులై అనేక అనర్దాలు కొని తెచ్చుకుంటున్నారు. . ముఖ్యంగా కాలేజీ విద్యార్ధులు క్రికెట్ బెట్టింగ్ లకు అలవాటు పడి తమ చదువు ను నిర్లక్ష్యం చేస్తుంటారు. అంతేకాక అప్పులు చేసి మరి బెట్టింగ్ లలో డబ్బు పోగొట్టుకొని రోడ్డు పాలౌతారు. ఒక సారి బెట్టింగ్ వ్యసనానికి అలవాటు పడ్డారో తమ ఆర్ధిక పరిస్థితి కూడా లెక్క చేయకుండా అప్పులు చేసి మరి బెట్టింగ్ లో పెడతారు. ఈ నేపధ్యంలోనే బెట్టింగులపై నిషేదం ఉన్న సంగతి తెలసిందె.
ఈ క్రమంలోనే సిరిస్ లో తలపడుతున్న అన్ని జట్ల లోని 11 మంది ఆటగాళ్ళను ఎంచుకొని బెట్టింగ్ పాల్పడే వారు తమ డ్రీమ్ జట్టు ను ఏర్పాటు చేసుకుంటారు. ఎంచుకున్న ఆటగాళ్ళ ఆట తీరు ను బట్టి వారికి పాయింట్లు లభిస్తాయి. వారు ఎంచుకున్న డ్రీమ్ జట్టులోని సభ్యుల పాయింట్ల ను ఆధారం చేసుకొని నగదు అందుతుంది.
కాగా క్రికెట్ బెట్టింగ్ ను పలు రాష్ట్ర ప్రభుత్వాలు నిషేదించాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ గేమింగ్ యాక్ట్ లో సవరణలు జరిగాయి. దీంతో ఏపీ లో కూడా ఐపీఎల్ స్పాన్సర్ డ్రీమ్ జట్టు 11 పై నిషేదాలు విదించారు. దీంతో డ్రీమ్ 11 యూజర్లు నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. నగదు చెల్లించే కంటెస్ట్ లకు మాత్రమే ఈ నిషేదం వర్తిస్తుంది. అయితే వ్యాలెట్ లో ఉన్న నగదును ఎలా విత్ డ్రా చేసుకోవాలా అని తెలియక యూజర్లు ఆందోళన చెందుతున్నారు. ఆ డబ్బు వాలెట్ లో సెఫ్ గా ఉంటుందని, వాలెట్ నుండి నగదు ఉపసంహరణపై డ్రీమ్ 11 వెల్లడించింది. వివరాల కోసం http://d11.co.in/HelpCenter లోకి వెళ్లి కాంటాక్ట్ అజ్ కింద తమను సంప్రదిస్తే నగదును తిరిగి చెల్లిస్తామని పేర్కొన్నారు.